తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై దారుణమైన భాషను ప్రయోగిస్తున్న కేటీఆర్ పై కేసు నమోదు అయింది. సీఎంను అసభ్యకరమైన వ్యాఖ్యలతో కించపరిచారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు ఈ నెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైనప్పుడు మీడీయా ఎదుట సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాడు..వీడు అనడమే కాదు.. కేసీఆర్ వెంట్రుక కూడా ఈ చిల్లరగాళ్లు పీకలేరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా వివిధ వర్గాలను రెచ్చగొట్టేలా చేశారని తన ఫిర్యాదులో వెంకట్ పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని వెంకట్ ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలను చూసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
కేటీఆర్ భాష .. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎంను కించ పరిచేలా ఉంది. సీఎంను కించ పరిస్తే.. తెలంగాణ ప్రజల్ని కించ పరిచినట్లేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆయనను గౌరవించాల్సిన అవసరమే లేదని అంటున్నారు. తాను అలాగే మాట్లాడతానని అంటున్నారు.