అమరావతి రైతులపై ఎన్నెన్ని కేసులో..!?

అమరావతి రైతులు కాలు కదిపితే కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం.. కొంత మంది దళిత రైతులపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా.. ఫిర్యాదు ఉపసంహరించుకున్నట్లుగా లేఖ ఇచ్చారు. అయినప్పటికీ.. పోలీసులు రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఇప్పుడీ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. భూములిచ్చి రోడ్డున పడి వారు చేసుకుంటున్న ఉద్యమానికి పెయిడ్ ఉద్యమం అని ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేస్తున్నా… సహిస్తూ… వారి ఉద్యమం వారు చేసుకుంటున్నారు. అయితే వారికి పోటీగా… స్పాన్సర్డ్ మూడు రాజధానుల ఉద్యమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి రాజధాని గ్రామాల్లోకి మనుషుల్ని తీసుకు వచ్చి.. పోటీ ధర్నాలు చేయిస్తున్నారు.

ఇలా రైతుల్ని తీసుకు వస్తున్న ఆటోలను కొంత మంది దళిత రైతులు రాజధాని గ్రామాల్లో అడ్డుకున్నారు. ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడమే నేరం అయినట్లుగా.. రైతులపై ఓ వ్యక్తితో ఫిర్యాదు చేయించారు. తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి ఉపసంహరించుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఫిర్యాదును మాత్రమే తీసుకున్నారు. ఉపసంహరణను పట్టించుకోలేదు. దళిత రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

అయితే పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఆ రైతుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి రాజధానిలో పెయిడ్ ఉద్యమం రోజువారీ పద్దతిలో సాగుతోంది. అసలైన రైతుల ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు వైసీపీ నేతలు చాలా చాలా కష్టాలు పడుతున్నారు. అందులో భాగంగా కేసులు నమోదు చేసి.. అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి కూడా వెనుకాడటం లేదు . భూములిచ్చిన రైతులు.. ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలో.. అన్ని విధాలుగా కష్టాలు పడుతున్నారు. అన్నింటికీ కారణం ప్రభుత్వమే. రాష్ట్ర రాజధానికి భూములివ్వడమే వారు చేసిన పాపం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close