ఏపీలో అంతే..! రాజకీయ నేతలు ప్రకటనలు ప్రచురించినా కేసులు..!

చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై ఆరోపణలు చేశారు. ఆ వార్తలు పత్రికల్లో వచ్చాయి. టీవీ చానళ్లలో వచ్చాయి. అయితే.. చంద్రబాబు అలా ఆరోపించడంపైనా.. ఆ వార్తలను ప్రసారం చేసిన టీవీ చానళ్లు, పత్రికలపైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం క్షమాపణ చెప్పకపోతే.. కేసులు పెడతామని హెచ్చరిస్తూ.. నోటీసులు పంపింది. … “ఏమిటి.. అవాక్కయ్యారా..” అనిపించేలా ఉన్న ఈ వ్యవహారం నిజమే. శనివారం రెండు విషయాల్లో ఇలా.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సూర్య పత్రికలకు లీగల్ నోటీసులు పంపించిట్లుగా.. ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ సెంటర్‌లో శనివారం హఠాత్తుగా గోపాలకృష్ణ ద్వివేదీ మీడియా సమావేశం పెట్టారు. సాధారణ ఎన్నికల సమయంలో.. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆయన… ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన ఎన్ని శాఖలకు బాధ్యుడిగా ఉన్నారో.. చాలా మంది విలేకరులకు కూడా తెలియదు. హఠాత్తుగా ఆయన మీడియా ముందుకు వచ్చి గనుల శాఖ గురించి మాట్లాడటం ప్రారంభించారు. దాంతో గనుల శాఖ కూడా ఆయన దగ్గరే ఉందనుకుని క్లారిటీకి వచ్చారు మీడియా ప్రతినిధులు. అయితే.. ఆయన మీడియా ముందుకు వచ్చింది… మీడియాపై కేసులు పెడుతున్నామని చెప్పడానికి. జగన్మోహన్ రెడ్డి సంస్థకు.. గనుల కేటాయింపుపై చంద్రబాబు ఆరోపణలు చేశారని.. వాటిని మీడియా ప్రచురించిందని.. తాము చెప్పిన అంశాలను మాత్రం ప్రచురించలేదని.. అందుకే తమ పరువు పోయినట్లుగా భావించి.. నోటీసులు ఇస్తున్నామని చెప్పేశారు.

ఇలా రాజకీయ నేతలు చేసిన ప్రకటనలను ప్రచురించిన వారిపై కేసులు పెట్టడం.. చరిత్రలో ఎప్పుడూ లేదని.. జర్నలిస్టులు ద్వివేదీతోనే ఆశ్చర్యం ప్రకటించగా.. అలాంటివి ఉన్నాయని.. న్యాయ సలహా తీసుకునే.. నోటీసులు ఇస్తున్నామని ప్రకటించారు. అంతకు ముందు… రేషన్ బియ్యం.. సంచుల్లో ముఖ్యమంత్రి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ.. చేసిన ఆరోపణల విషయంలోనూ… చంద్రబాబుకు.. ఆంధ్రజ్యోతికి.. సూర్యకు నోటీసులు ఇచ్చినట్లుగా చెప్పారు. అయితే.. ప్రభుత్వ వాదన ప్రకారం.. తాము పంపిన రిజాయిండర్లు ప్రచురించలేంటున్నారు. కానీ ఆ పత్రికలు.. ప్రభుత్వ రిజాయిండర్లు.. మంత్రులు మాట్లాడిన మాటల్ని కూడా ప్రచురించామని చెబుతున్నాయి. ఎంతైనా ఏపీలో ఇప్పుడు కేసుల విప్లవం నడుస్తోంది. అందులో ఇదీ భాగమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close