జగన్ అక్రమాస్తుల కేసులన్నీ సిబిఐ కోర్టే విచారిస్తుంది

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమాస్తుల కేసులను ఈడి కోర్టుకు బదిలీ చేయాలని ఈడీ అభ్యర్ధనను సిబిఐ కోర్టు తిరస్కరించింది. మాధవ రామచంద్రన్, టిఆర్ కన్నన్ మరియు ఎకె దండమూడి అనే ముగ్గురు పారిశ్రామిక వేత్తలు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుండి పొందిన ప్రయోజనాలకు ప్రతిగా క్విడ్ ప్రొ పద్దతిలో రూ.34 కోట్లు జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టారని సీబీఐ ఒక కేసు నమోదు చేసింది. సిబిఐ కోర్టు ఆ కేసును విచారిస్తోంది. అదే సమయంలో ఈడి అధికారులు కూడా దానితో సహా జగన్ పై సీబీఐ నమోదు చేసిన అన్ని కేసులపై సమాంతరంగా విచారణ చేపట్టడానికి సిద్దం అయ్యారు.

దానిపై అభ్యంతరం తెలుపుతూ జగన్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు స్పందిస్తూ ఆ కేసులను అన్నిటినీ ఈడికి బదిలీ చేసే విషయంపై సిబిఐ కోర్టుని తన అభిప్రాయం తెలుపవలసినదిగా కోరింది. అందుకోసం ఈడి కూడా సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిపై సిబిఐ కోర్టులో నిన్న ఈడి, సిబిఐ, జగన్ తరపున న్యాయవాదుల వాదనలు వినిపించారు. పి.ఎం.ఎల్. చట్టంలోని సెక్షన్:44 (1) (సి) ప్రకారం ఈ కేసును విచారించే అధికారం తమకే ఉంటుందని ఈడి న్యాయవాది వాదించగా, దానిని సిబిఐ న్యాయవాది వ్యతిరేకించారు. కేంద్రప్రభుత్వం ఈడికి ఆ అధికారాలు కల్పిస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తే తప్ప సిబిఐ పరిధిలో ఉన్న ఆ కేసును ఈడికి అప్పగించడం సాధ్యం కాదని వాదించారు. జగన్ తరపున న్యాయవాది కూడా సిబిఐ కోర్టు విచారిస్తున్న కేసును ఈడికి బదిలీ చేయడం సరికాదని వాదించారు. ముగ్గురి వాదనలు విన్న తరువాత సిబిఐ న్యాయమూర్తి ఈడి పిటిషన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కనుక జగన్ అక్రమాస్తుల కేసులన్నీ ఇక ముందు కూడా సిబిఐ కోర్టే విచారిస్తుంది. దీనిపై ఈడి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close