వైఎస్ఆర్ ప్రదేశ్‌గా ఏపీ .. సీబీఐ మాజీ చీఫ్ సలహా !

ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్‌గా మార్చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని సీబీఐ మాజీ డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావు ఏపీ సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళనలు విస్తృతంమైన తరుణంలో ఆయన ట్విట్టర్‌లో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుందని కూడా చెప్పారు.

ఇప్పటికే కడప పేరును తొలగించి పూర్తిగా వైఎస్ఆర్ జిల్లా అని మార్చేశారు. పలు జిల్లాలకు ఇతర వ్యక్తుల పేర్లు పెట్టారు. అందుకే మన్నెం నాగేశ్వరరావు ఈ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగువ్యక్తి అయిన మన్నెం నాగేశ్వరరావు ఒరిస్సా క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన కేంద్ర సర్వీసుల్లో కొన్ని హఠాత్ పరిణామాల మధ్య సీబీఐ డైరక్టర్ అయ్యాడు. అవమానకరంగా బదిలీ అయ్యాడు . తర్వాత రిటైరయ్యారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్‌లో హిందూత్వ వాదం వినిపిస్తూ వివాదాస్పద అంశాలపై ట్వీట్లు చేస్తున్నారు.

ఇటీవల ట్విట్టర్‌పై కోర్టుకెళ్లి చీవాట్లు తిన్నాడు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూండటంతో.. వెరీఫైడ్ అకౌంట్ హోదాను ట్విట్టర్ తొలగిచింది. బ్లూటిక్ తీసేయడంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ సారి ఉత్తర్వులు ఇచ్చినా మళ్లీ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు జరిమానా విధించింది. మన్నెం నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల విషయంలో ఎక్కువగా వ్యాఖ్యలు చేయరు. కానీ ఇప్పుడు నేరుగా జగన్ ప్రభుత్వాన్ని గురి పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close