కోర్టుల్లో పిటిషన్లు పడినప్పుడల్లా సీబీఐ హడావుడి !

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను ప్రశ్నిస్తున్నారు. ఇనయతుల్లా వివేకాకు వ్యక్తిగత కార్యదర్శిగా, ఇంట్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవారు. హత్య జరిగినప్పుడు వివేకా ఇంట్లోకి తొలుత వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహానికి ఫొటోలు, వీడియోలను ఇనయతుల్లానే తీశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ ద్వారానే ఇతరులకు ఫొటోలు షేర్ చేశారు. వీటన్నింటిపై గతంలోనే వివరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రస్నిస్తున్నాయి.

మరో వైపు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ఆంధ్రప్రదేశ్‌లో అడ్డంకులు సృష్టిస్తున్నందున దానిని హైదరాబాద్‌కు బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. సీబీఐ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గత వారం వివేకా కేసు దర్యాప్తుచేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై నమోదు చేసిన ప్రైవేటు పిటిషన్లు కొట్టేయాలని హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు నిందితుల్ని పిలిస్తే తమపైనే కేసులు దాఖలు చేస్తే ఇక వివేకా కేసులో దర్యాప్తు ముందుకు సాగదని సీబీఐ న్యాయవాది హైకోర్టుకు తేల్చిచెప్పేశారు. దీనిపై 22వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది.

ఈ క్రమంలో సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. సీబీఐ అధికారులు సుదీర్గంగా విచారణ జరుపుతున్నారు. కానీ కీలక నిందితులని .. సూత్రధారుల్ని మాత్రం అరెస్ట్ చేయలేదు. వారెవరో సీబీఐ స్పష్టం తెలుసుకున్నా అరెస్ట్ చేయలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కాగానే సీబీఐ మళ్లీ హడావుడి ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close