ఢిల్లీలో కలకలం: కేజ్రీవాల్ ఆఫీస్‌పై సీబీఐ దాడులు

హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంపై సీబీఐ ఇవాళ దాడులు జరిపింది. సీబీఐ అధికారులు కేజ్రీవాల్ కార్యాలయంలో, ఇతర మంత్రుల ఛాంబర్లలో సోదాలు నిర్వహించారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో వెల్లడించటమే కాకుండా, నరేంద్రమోడి ప్రభుత్వపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజకీయంగా తనను ఎదుర్కొనలేక, ఇలాంటి పిరికిపనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోడి ఒక పిరికిపంద, సైకోపాత్ అని విమర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలమేరకే సీబీఐ సోదాలు జరుపుతోందని ఆరోపించారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం, తాము కొందరు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజేంద్రకుమార్ కార్యాలయంపైనే తాము దాడులు జరుపుతున్నామని చెప్పారు. రాజేంద్రకుమార్ కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ రాష్ట్ర టెండర్లు ఒక నిర్ణీత సంస్థకే దక్కేటట్లు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం అనుమతితోనే సోదాలు చేస్తున్నామని, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. అయితే ఆ ఆరోపణలు అబద్ధమని కేజ్రీవాల్ అన్నారు. తన ఆఫీసుపైనే దాడులు జరిగాయని, తన కార్యాలయంలోని ఫైల్స్‌ను సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజేందర్ అనేది ఒక నెపం మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రానికి లొంగేదిలేదని ట్వీట్ చేశారు. అయితే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు కేజ్రీవాల్ ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రధానిపై ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. కేంద్రంతో ఘర్షణ పడటం కేజ్రీవాల్‌కు సరదా అన్నారు.

ఢిల్లీ నగరంలోని షాకూర్ బస్తీలో మురికివాడలను రైల్వే అధికారులు కూల్చివేయటంతో ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య కొత్త గొడవ ప్రారంభమయింది. ఈ బస్తీవాసులు ఆప్ పార్టీకి ఓటు వేశారని కక్షసాధింపుగానే కేంద్రం ఈ కూల్చివేతకు పాల్పడిందని ఆ పార్టీ నేతల ఆరోపణ. ఈ కూల్చివేతల సందర్భంగా మురికివాడలలోని ఒక చిన్నపాప కూడా చనిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close