అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోనున్న సీబీఐ !?

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై సీబీఐ ఇప్పటికే ముందస్తు సన్నాహాలన్నీ చేసుకుంది. అవినాష్ రెడ్డి ఎంపీ కావడంతో స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు సీబీఐకి స్పీకర్ అనుమతి కూడా ఇచ్చారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రెండు, మూడు రోజుల్లో ఆయనను అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు. అవినాష్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అవినాష్ రెడ్డి క్యాంప్ నుంచి ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ పైన.. వైఎస్ వివేకా కుమార్తె పైనా ఆరోపణలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది.

కేసును ముందుకు తీసుకెళ్లకుండా ఒత్తిడి చేసే వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కొద్ది రోజులు విచారణ నిలిపివేసి ఢిల్లీకి వెళ్లారు. తిరిగి వచ్చి ఇప్పుడు నేరుగా అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూండటంతో.. ఈ కేసులో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close