తెలకపల్లి వ్యూస్ : విగ్రహాలు సరే, విధానాలు?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పోటీ పడి భారీ ఎత్తున 124,126 అడుగుల బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహాల ప్రతిష్టాపన ప్రకటించడం మంచి విషయమే. ఇందుకు గాను చంద్రబాబు నాయుడును జూపూడి ప్రభాకరరావు బృందం ప్రశంసలతో ముంచెత్తింది. తెలంగాణలో కడియం శ్రీహరి ప్రభృతులు కూడా ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు.

అమరావతిలో అంబేద్కర్‌ విగ్రహం చుట్టూ ఉద్యానవనం ఏర్పాటు చేస్తుంటే, హైదరాబాదులో ఎన్టీఆర్‌ స్మారక చిహ్నాన్నివదలివేసి ఆయన పేరిట వున్న పార్కులో ఈ భారీ విగ్రహం పెడతామంటున్నారు. అంబేడ్కర్‌ వివక్షా పూరితమైన హిందూ మతాన్ని వదలివేసి బౌద్ధం స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. అమరావతి ఒకనాటి బౌద్ధకేంద్రం కాగా ట్యాంక్‌బండ్‌ బుద్ధవిగ్రహం దరిదాపుల్లోనే హైదరాబాద్‌ అంబేద్కర్‌ విగ్రహం రానుండడం విశేషం. 125 వ జయంతి సందర్భంలో ఈ ప్రతిపాదనలు వచ్చాయి.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల పేరిట హడావుడి చేసింది. కాంగ్రెస్‌ పునరుద్ధరణకు రాహుల్‌గాంధీ సామాజిక న్యాయ మార్గాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కేంద్ర రాష్ట్రాల్లోని పాలక పార్టీలూ ఈ విధంగా అంబేద్కర్‌ను గౌరవించడంతో ఆగక ఆయన ప్రధాన సందేశాన్ని గుర్తించి అమలు చేయడం ముఖ్యం. రాజ్యాంగం ప్రకారం రాజకీయ హక్కులలో లభించిన సమానత్వం, ఆర్థిక సామాజిక విషయాలలో కూడా వస్తేనే ప్రజాస్వామ్య ప్రక్రియ పరిపూర్ణమవుతుందని అంబేద్కర్‌ ఆనాడే స్పష్టం చేశారు.

సరళీకరణ యుగంలో నూతన ఆర్థిక విధానాల ఫలితంగా దళితులు అణగారిన వర్గాల పరిస్థితి ఆచరణలో దిగజారుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సామాజిక సంక్షేమం , ఉప ప్రణాళికల అమలు సక్రమంగా లేదని కాగ్‌ నివేదికలు విమర్శించాయి. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ వినిపించిన నిరసనధ్వానాలలోనూ అంబేద్కరిస్టులూ అభ్యుదయవాదులే ప్రధానంగా దాడులకు గురైనారు. ఈ విధానాలు మార్చకుండా ప్రచారాలకు రాజకీయాలకు పరిమితమైతే ఉపయోగం లేదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close