మండలి ఛైర్మన్‌పైనే నిఘా పెట్టిన అధికారి !

శాసనమండలి చైర్మన్ అంటే.. రాజ్యంగ పదవి. ఆయనపై ఎవరైనా నిఘా పెట్టలగరా ? కానీ ఏపీ అసెంబ్లీలో డిప్యూటేషన్ పై వచ్చిన ఓ అధికారి ఆయనపై నిఘా పెట్టేశారు. ఏకంగా ఆయన చాంబర్ వైపు సీసీ కెమెరా పెట్టేశారు. స్వయంగా శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆయనను పిలిచి.. పద్దతిగా చెప్పారు. ఎందుకంటే.. ఆయన ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఆ పోస్టులోకి వచ్చారు. అదే ధైర్యం ఆయనకు ఉన్నట్లుగా ఉంది.

చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. ఆ సీసీ కెమెరాను చైర్మన్ చాంబర్ వైపు నుంచి తప్పించలేదు. ఇంకా ఒత్తిడిచేస్తే.. అంత సీక్రెట్ సమావేశాలు ఎవరితో నిర్వహిస్తున్నావని.. సీసీ కెమెరా ఉంటే భయం ఎందుకు అని సొంత పార్టీ నేతలే అడుగుతారని ఆయన కూడా ఆగిపోయారు. పెద్దగా పట్టించుకోవడం లేదు. మండలి చైర్మన్ విషయంలోనే ఇలా ఉంటే ఇతరుల విషయంలో మాత్రం ఆ అధికారి అంత సాఫ్ట్ గా ఉంటారా..? చాన్సే లేదు. ఆయన ఉద్యోగుల్ని సొంత పనులకు వాడుకుటున్నారు. సొంతంగా డ్రైవర్‌ను పెట్టుకుని వారి జీతాలను.. సిబ్బంది నుంచి ఇప్పిస్తున్నారు. ఇలాంటి లీలలు చాలా జరుగుతున్నాయి. అయితే ఆయన ప్రభుత్వ పెద్దలకు దగ్గర కాబట్టి అందరూ భరిస్తున్నారు.

కానీ ఆయన చేస్తున్న పనులను మాత్రం వీలైనంతగా మీడియా వర్గాలకు లీక్ చేస్తున్నారు. అసెంబ్లీకి సంబంధించిన అంశం కావడంతో ఆయన పేరు బయట పెట్టి రాయడానికి మీడియా కూడా సిద్ధపడటం లేదు. అయితే త్వరలో అసెంబ్లీ ఉద్యోగాలు ఆయన నిర్వాకాలకు వీడియో ఆధారాలను.. మీడియాకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎప్పుడైనా ఆయన వీడియోలు హైలెట్ కావొచ్చన్న ప్చారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close