డ్రగ్స్ కేసులో సెలక్టివ్ పేర్లే లీక్ చేస్తన్నారా ?

హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తన్న డ్రగ్స్ కేసులో కొన్ని పేర్లే లీక్ కావడం వివాదాస్పదమవుతోంది. నిజానికి ఆర్జీవీ సహా అనేక మంది ప్రమఖులతో కేపీ చౌదరి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కానీ అషూరెడ్డి, జ్యోతి వంటి వారితో పాటు పెద్దగా ఇంకా వెలుగులోకి రాని వారి పేర్లు రిమాండ్ రిపోర్టులో చూపించారు. ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు.. మరికొంత మంది ప్రముఖుల పిల్లలు అంటూ లీకులు ఇస్తున్నారు. అషూరెడ్డి, జ్యోతి తమకు కేపీ చౌదరి తెలుసు కానీ.. డ్రగ్స్ తో సంబంధం లేదని చెబుతున్నారు. వీరిద్దరూ గతంలో ఆర్జీవీతో వేసిన వేషాలు చూస్తే.. ఏదో తేడాగా ఉందే అని అనుకోక తప్పదు.

ఇప్పుడు కేపీ చౌదరి ఫోన్ లిస్టులో ఉన్న వారందర్నీ.. ఆయనతో ఫోటోలు దిగిన వారందర్నీ.. అనుమానితులు అన్నట్లుగా కొంత మంది సెలక్టివ్ పేర్లను మీడియాకు లీక్ చేస్తున్నారు. ఈ వ్యవహారం కుట్ర పూరితంగా సాగుతోందన్న అనుమానాలు టాలీవుడ్ లో వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు కూడా ఓ సారి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సద్దుమణిగిపోయింది. అప్పట్లోనూ చాలా మంది పేర్లను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ డ్రగ్స్ కేసు పైకి రావడం రాజకీయవర్గాల్లోనూ సంచలనం అవుతోంది.

ఇప్పటి వరకూ ఇలాంటి డ్రగ్స్ కేసులు ఎన్ని బయటకు వచ్చాయో లెక్క లేదు. కానీ ఒక్క టంటే ఒక్క దాంట్లోనూ నిజాలు బయటకు రాలేదు. అంతా హడావుడి చేసి అసలు ఎలాంటి ఆధారాలు లేవని కేసులు మూసేశారు. చివరికి ఈడీ దర్యాప్తు చేస్తామన్నా సహకరించని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఏమవుతుందో కానీ.. కాల్ లిస్టులోఉన్నాయని చెప్పి కొంత మంది పేర్లను వైరల్ చేస్తున్నారు. వారిని మానసిక వేదనకు గురి చే్సతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close