జి.హెచ్.ఎం.సి.ఎన్నికల కోసం బీజేపీ కూడా బంపర్ ఆఫర్?

అడగందే అమ్మయినా పెట్టదన్నట్లు, అసంతృప్తి వ్యక్తం చేయకపోతే కేంద్రం కూడా చెయ్యి విధిలించదని ఇప్పుడు చెప్పుకోవలసి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడిని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని ఎన్నిసార్లు అడిగినా ప్రత్యేక హోదా కాకపోయినా కనీసం వాళ్ళు ఇస్తామని ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కూడా ఇంతవరకు మంజూరు చేయడంలేదు ఎందుకో? ప్రత్యేక రైల్వే జోన్ హామీని కూడా కేంద్రం పక్కన పడేసినట్లుగా వార్తలు వచ్చేయి. చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రాదేయపడినా సాధ్యం కాని కొన్ని పనులు తెరాస నేతలు కేంద్రం తీర్పుపై కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినంతనే సాధ్యం అవుతున్నాయి.

నెలరోజుల క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు రెండు లక్షల ఇళ్ళు, తెలంగాణాకి కేవలం 10, 000 ఇళ్ళు మంజూరు చేసినప్పుడు తెరాస నేతలు అందరూ కేంద్రంపై చిటపటలాడారు. తెలంగాణా రాష్ట్రంపట్ల కేంద్రం చాలా వివక్ష చూపుతోందని వారు విమర్శించారు. వారి విమర్శలకి బీజేపీ నేతలు సరిగ్గానే జవాబు చెప్పుకొన్నారు. కానీ వాటి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య కేంద్రం చాలా వ్యత్యాసం చూపిస్తోందనే భావన తెలంగాణా రాష్ట్ర ప్రజలకు కలిగేలా చేయగలిగారు.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు ముందు బీజేపీ పట్ల ఇటువంటి చెడు అభిప్రాయం ఏర్పడటం అంత మంచిది కాదని కేంద్రం భావించిందో ఏమో తెలియదు కానీ నిన్న తెలంగాణా రాష్ట్రానికి 45,217 ఇళ్ళు మంజూరు చేసింది. బహుశః జి.హెచ్.ఎం.సి.ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వాటిలో 29, 531 హైదరాబాద్ కి కేటాయించినట్లుంది. కానీ తెరాస ప్రభుత్వం కూడా జి.హెచ్.ఎం.సి.పరిధిలో నివసిస్తున్న పేద ప్రజలకి ‘డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్’ బంపర్ ఆఫర్ ఇస్తోంది. కనుక తెరాస,బీజేపీలు ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్లలో జంటనగరాలలో ప్రజలు వెతికి మొగ్గుచూపి ఎవరికీ ఓట్లు వేస్తారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close