పోలవరం “బాధ్యత” నుంచి వైదొలుగుతున్న కేంద్రం..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో వేస్తున్న ప్రశ్నల ద్వారా.. కేంద్రం.. మెల్లగా.. ఒక్కొక్కటిగా… తన బరువును దించుకుంటోంది. ఆయన వేస్తున్న ప్రశ్నలకు.. తమ విధానం ఇదే అన్నట్లుగా జవాబులు ఇస్తోంది. వాటిపై.. వైసీపీ సభ్యులు మాట్లాడలేకపోతున్నారు. ఖండించలేకపోతున్నారు. వైసీపీ సభ్యుల… నిరాసక్తతను గమనించిన కేంద్రం… విభజన హామీల విషయంలో… అంత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. దానికి.. పోలవరంపై.. కేంద్రం చెప్పిన సమాధానమే సాక్ష్యం.

90 శాతం ఖర్చు భరించడంపై కొత్త మాటలు..!

విభజన చట్టం ప్రకారం… పోలవరం ప్రాజెక్ట్ .. జాతీయ ప్రాజెక్టు. నిబంధనల ప్రకారం… జాతీయ ప్రాజెక్ట్ అంటే.. 90 శాతం ఖర్చు కేంద్రం భరించాలి. పది శాతం రాష్ట్రం పెట్టుకోవాలి. అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నందున… ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో.. ఆ పది శాతం ఖర్చు కూడా కేంద్రమే భరించేలా అప్పటి సర్కార్ ఒప్పించింది. అంటే.. మొత్తం వంద శాతం పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రానిదే. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కొన్ని వందల సార్లు చెప్పారు. కానీ.. ఇప్పుడు.. వంద శాతం గురించి కాదు.. 90 శాతం గురించి కూడా… వేరే మాటలు చెబుతున్నారు. 90 శాతం ఖర్చు భరించాలని.. ఆర్థిక శాఖ చెప్పలేదంటూ… కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం… కలకలం రేపుతోంది. ఇలా చెప్పాలంటే.. కచ్చితంగా కేంద్రానికి రెండో ఉద్దేశాలున్నాయని అనుకోవడమేనంటున్నారు.

రూ. 35వేల కోట్ల భారం రాష్ట్రంపై పడుతోందా..?

ప్రాజెక్ట్ సహాయ, పునరావాస బాధ్యత.. రాష్ట్ర ప్రభుత్వానిదేనని.. విజయసాయిరెడ్డి.. కేంద్రమంత్రితో చెప్పించారు. కానీ.. దీనిపై.. పార్లమెంట్‌లో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి సాగునీటి ప్రాజెక్ట్ అంటే.. అందులో మొట్టమొదటిగా వచ్చే అంశం భూసేకరణ. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ పరిహారం ఇచ్చి ఖాళీ చేయించాలి. దీన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంటారు. ఇదంతా ప్రాజెక్టులో భాగం. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు భరిస్తామని చెబుతున్న కేంద్రం.. ఈ ఆర్ అండ్ ఆర్ బాధ్యత మాత్రం తమది కాదంటోంది. గత ఏపీ సర్కార్ దీనిపై తీవ్రంగా పోరాడింది. అందుకే.. నేరుగా ప్రకటన చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి.. తమకేం సంబంధం లేదని మొహం మీదే చెబుతోంది. దీంతో పోలవర సహాయ, పునరావాసానికి అయ్యే రూ. 35వేల కోట్ల రాష్ట్రానికి భారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

22 మంది ఎంపీలు నోరు తెరవరా..?

విభజన హామీలపై ఒక్కొక్క అంశంపై..కేంద్రం పుల్లవిరుపుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కరంటే.. ఒక్క వైసీపీ ఎంపీ కూడా… మాట్లాడటం లేదు. పార్లమెంట్లో విభజన సమస్యల గురించి .. ఏపీకి రావాల్సిన నిధులు.. ఇతర అంశాల గురించి.. ఒక్కరంటే.. ఒక్కరూ మాట్లాడలేదు. మరో వైపు.. విజయసాయిరెడ్డి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ… బీజేపీ నుంచి ఏమీ రాదనే… సమాధానం ఇప్పిస్తున్నారు. దాంతో.. ఇది మొత్తం ఓ గూడు పుఠాణి వ్యవహారంలా సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే రాజకీయం నడుస్తోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close