కేంద్రం పట్ల తెరాస అనుసరిస్తున్న వైఖరే సరయినదేమో?

ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు కేంద్రం నుండి సహాయసహకారాలు పొందడానికి పూర్తి భిన్నమయిన మార్గాలను ఎంచుకొన్నాయి. బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్రాలలో భాగస్వామిగా ఉన్న కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడితో విధేయంగా ఉంటూ కేంద్ర సహకారం పొందుతుంటే, తెలంగాణాని కేంద్రం చిన్నచూపు చూస్తోందని నిత్యం విమర్శిస్తూ కేంద్రానికి సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి కల్పించి, కేసీఆర్ కేంద్ర సహకారం అందుకొంటున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవలంభిస్తున్న ఈ విభిన్నవిధానాలలో కేసీఆర్ అనుసరిస్తున్న విధానమే సత్ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడిని ఎన్నిసార్లు ప్రాధేయపడినా బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి కేవలం రూ.100 కోట్లే విదిలించారు. కానీ తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మొన్న డిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతిని కలిసి చిరకాలంగా పెండింగులో ఉన్న రాజీవ్ భీమ, జగన్నాథ్ పూర్, కొమరం భీమ్ మరియు పాలెం వాగు ప్రాజెక్టులని పూర్తి చేయడానికి తగినన్ని నిధులు విడుదల చేయవలసిందిగా కోరినప్పుడు ఆమె అందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించగానే తగిన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అవి కాక దేవాదుల ప్రాజెక్టు కోసం వారం రోజులలోగా రూ. 112 కోట్లు నిధులు విడుదల చేసేందుకు ఆమె అంగీకరించారు. అంతే కాక తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా చూసేందుకు ఆమె త్వరలో హైదరాబాద్ వస్తానని చెప్పారు.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా వివిధ దశలలో ఉన్న ఇటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో ఏ.ఐ.బి.పి. (ఎక్సిలిరేటడ్ ఇర్రిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) అనే ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దాని ద్వారా దేశంలో ఇటువంటి పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను సేకరించి ప్రాధాన్యత క్రమంలో వాటికి నిధులు కేటాయిస్తోంది. కనుక తెలంగాణాలో పెండింగులో ఉన్న ఆ ఆరు ప్రాజెక్టుల వివరాలను మంత్రి హరీష్ రావు మొన్న జలవనరుల శాఖ నిర్వహించిన సమావేశంలో తెలియజేసి వాటికి నిధులు సమకూర్చుకొన్నారు.

తెలంగాణా లేదా దేశంలో మరే రాష్ట్రంలో అయినా సరే రైతన్నలకు మేలు చేకూర్చే ప్రాజెక్టులు పూర్తిచేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈవిధంగా చొరవ చూపడం చాలా అభినందనీయమే. తెలంగాణాలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చొరవ చూపిన మంత్రి హరీష్ రావు, కేంద్రమంత్రి ఉమా భారతిని అందుకు ప్రత్యేకంగా అభినందించాలి. దేశంలో చిరకాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టులలో పోలవరం ప్రాజెక్టు కూడా ఒకటి. రాష్ట్ర విభజన సమయంలో దానిని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణ బాధ్యత కూడా పూర్తిగా తమదేనని ప్రకటించింది. కానీ రెండు బడ్జెట్ లలో కలిపి దాని కోసం కేటాయించింది కేవలం రూ.200 కోట్లు మాత్రమే. ఈవిధంగా అరకొర నిధులు విడుదల చేస్తున్న కారణంగా ఈ 22 నెలలలో ఇంతవరకు దాని పనులు వేగవంతం కాలేదు. తెదేపా ప్రభుత్వం దాని గురించి తరచూ కేంద్రానికి గుర్తు చేస్తునప్పటికీ ఎటువంటి స్పందన కనబడటంలేదు. అంటే కేంద్రం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మెతక వైఖరి సరికాదని, ఆ కారణంగానే కేంద్రం దాని పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని భావించక తప్పదు. ఈవిధంగా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతున్నా కూడా ఆయన పార్టీ ప్రయోజనాలను, బీజేపీతో సంబంధాలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీతో స్నేహం కోసం ఆయన ఆరాటపడుతూ కాలక్షేపం చేసేస్తే మొదటికే మోసం వస్తుందేమో ఆలోచించుకొంటే మంచిది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close