చంద్రబాబు, లోకేష్‌లపై లాక్‌డౌన్ కేసులు..!

చంద్రబాబునాయుడు, లోకేష్ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఓ లాయర్ చేసిన ఫిర్యాదు మేరకు.. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం చంద్రబాబునాయుడు.. వర్చువల్ మహానాడు నిర్వహణ కోసం..హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు. ఆ సమయంలో.. ఆయనకు పలు చోట్ల కార్యకర్తలు స్వాగతం పలికారు. నేతలే ఇలా జన సమీకరణ చేసి స్వాగతం చెప్పారని… దానికి చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహం ఇచ్చారని… వారు కనిపించినప్పుడల్లా.. కాన్వాయ్ ఆపి చేతులు ఊపి… కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను వైసీపీ నేతలు చేశారు.

కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు పిటిషన్ దార్లకు సూచించింది. ఆ తర్వాత బి.శ్రీనివాసరావు అనే లాయర్ నందిగామ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఇప్పటికే అనేక మంది విపక్ష నేతలపై కేసులు పెట్టారు. పేదలకు సాయం పంపిణీ చేసే సమయంలో… భౌతిక దూరం.. మాస్కుల నిబంధనలు పాటించలేదని కేసులు పెట్టారు.

అయితే.. అంత కంటే దారుణంగా.. ర్యాలీలు.. నిర్వహించి.. పుట్టిన రోజు.. పెళ్లి రోజు వేడుకలను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. వైసీపీ నేతలు చేసుకున్నప్పటికీ… పోలీసులు వారి జోలికి వెళ్లలేదు . చివరికి ఎమ్మెల్యేలపై కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వారు చేసిన సామూహిక లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన వీడియోను హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా… లాక్ డౌన్ నిబంధనల కేసుల్లో చిక్కుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close