త్వరలో చంద్రబాబు “ఓదార్పు యాత్ర”..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… త్వరలో ఓదార్పు యాత్ర తరహాలో రాజకీయ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. తెలుగుదేశం పార్టీపై దాడులు జరుగుతున్నాయి. ఇలా టీడీపీ.. ఎప్పటికప్పుడు.. ఎవరెవరిపై దాడులు జరిగాయో… సమాచారం సేకరిస్తోంది. వారికి రక్షణగా ఉండేలా.. స్థానిక నేతల్ని పురమాయిస్తోంది. ఇప్పటి వరకూ 150కిపైగా దాడులు జరిగాయని.. ఆస్తుల విధ్వసం… హత్యలు కూడా చోటు చేసుకున్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. వీరందర్నీ పరామర్శించడానికి చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమాన్ని ఖరారు చేసుకునే ప్రయత్నం లో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ దాడులు.. టీడీపీ పెరిగాయని అంటున్నారు. ప్రస్తుతం పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చిస్తున్న చంద్రబాబు… కార్యకర్తలపై జరుగుతున్న దాడుల విషయంలో.. సీరియస్‌గా ఉన్నారు. హత్యకు గురయిన కార్యకర్తల కుటుంబాలను.. గాయపడిన వారిని.. పరామర్శించేందుకు.. చంద్రబాబు.. వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా నిర్వహించాలి… ప్రభుత్వ తీరును.. వైసీపీ నేతల రౌడీయిజాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశంపై టీడీపీలో విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇది ఖరారైన తర్వాత చంద్రబాబు పర్యటనలు ఉండే అవకాశం ఉంది.

ప్రతీచోటా కాపలా ఉండలేమంటూ… స్వయంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు.. టీడీపీకి ఆయుధంగా మారాయి. హోంమంత్రి చేతులెత్తేసి… వైసీపీ శ్రేణులకు దాడులు చేసుకోమని సందేశం పంపారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో.. కార్యకర్తల రక్షణ కోసం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి ఉంటుందంటున్నారు. సోమవారం నుంచి… చంద్రబాబు… గుంటూరులోని టీడీపీ ఆఫీసుకు రోజూ వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కొంత సమయం.. పార్టీ కార్యక్రమాలకు.. మరికొంత సమయం.. పార్టీ నేతలతో వ్యూహాల ఖరారుకు కేటాయిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close