విజయవాడ, గుంటూరు ప్రజలకు చంద్రబాబు వార్నింగ్

హైదరాబాద్: విజయవాడ, గుంటూరు నగరాలలో ఇళ్ళ యజమానులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ శివార్లలోని తాడిగడపలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతూ, విజయవాడలో అద్దెలు బాగా పెంచేశారని ప్రభుత్వోద్యోగులు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇక్కడకంటే హైదరాబాద్ బెటర్‌గా ఉందని, విజయవాడకు ఎలావస్తామని అంటున్నారని చెప్పారు. విజయవాడలో భూమి రేట్లు ఎక్కువని, అందుకనే యజమానులు ఆ భూమి ఉంటే చాలనుకుని అమ్మటం కూడా మానేసి రేట్లు కూడా పెంచేశారని అన్నారు. విజయవాడకంటే సింగపూర్ నగరంలో వ్యాపారం చేయటం తేలిగ్గా ఉందని చమత్కరించారు. భూమి విలువ పెరిగిపోయిందని, రెంట్‌లు పెరిగిపోయాయని, ఇలా ఉంటే ఎవరైనా వేరే ఊళ్ళకు వెళ్ళిపోతామనుకుంటారని చెప్పారు. భూములమీద, అద్దెలమీద సంపాదించాలనుకోవటం పొరపాటని, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకోవాలని సూచించారు. ఈ కారణంవల్లే విజయవాడలో పెద్దగా పరిశ్రమలు రాలేదని చెప్పారు. విజయవాడవాళ్ళు, కృష్ణా జిల్లావాళ్ళు బయటకెళ్ళి ప్రపంచమంతటా పరిశ్రమలు పెట్టారని అన్నారు. అద్దెలు, భూముల విలువలు భారీగా పెరిగితే పెట్టుబడులు రావని విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ఇలాగైతే అందరూ రాయలసీమవైపు చూస్తారని అన్నారు. అక్కడకూడా అలాగే భూముల ధరలు, అద్దెలు పెంచితే ఇక పెట్టుబడులు పెట్టేవారు ఇతర రాష్ట్రాలవైపు చూస్తారని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను వైద్యసేవలకు కేంద్రంగా మార్చాలన్నది తన ఆలోచన అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close