మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తునూ ప్లాన్ చేసుకున్న చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనకు లభించిన సమయాన్ని స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు వేసవి విడిది కోసం వెళ్లిన సీఎం… వచ్చే నెల రెండో తేదీ నుంచి కీలక కార్యాచరణ పెట్టుకున్నారు. మే 2 నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి ఏకంగా 13 రోజుల పాటు జరగనున్నాయి. రోజుకు రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థులతో తొలుత చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి 50 మంది చొప్పున.. ఏడు నియోజకవర్గాల నుంచి పిలిపించినవారితో చంద్రబాబు సమావేశం అవుతారు. పోలింగ్‌ సరళి, బూత్‌లవారీ లెక్కలు, నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి.. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడతారు.

మధ్యలో రెండ్రోజుల పాటు పశ్చిమబెంగాల్‌ ప్రచారానికి వెళ్తారు. ఇప్పటికే… బూత్‌ల వారీగా వివరాలతో..ప్రత్యేకమైన నివేదికలు ఇవ్వాలని.. అభ్యర్థులందర్నీ చంద్రబాబు ఆదేశించారు. దానికి సంబంధించి అభ్యర్థులు కిందామీదా పడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ నివేదికల్లోనే… పార్టీ కోసం పని చేసిన వారెవరు అన్నదానిపై.. ప్రత్యేకమైన సమాచారం సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. రెండు, మూడు నెల్లోనే.. పంచాయతీ, జిల్లా,మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలన్నింటినీ… పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాత పాలనకు .. ఏ ఎన్నికలు అడ్డం రావన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మామూలుగా.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో.. అధినేత ప్రమేయం స్వల్పమే.

కానీ ఈ సారి ఎన్నికల కోడ్ అంటూ.. ప్రభుత్వాన్ని పని చేయకుండా చేయడంతో.. పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లా, మండల పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పోస్టులకు.. డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం చేసేందుకు చంద్రబాబు ఈ సమీక్షలను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close