వంశీ లేఖకు.. చంద్రబాబు మార్క్ రిప్లయ్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసులు, అధికారులు కేసులు పెట్టి వేధిస్తూండటం వల్ల.. అనుచరుల్ని ఇబ్బంది పెట్టలేక.. రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని గన్నవరం ఎమ్మెల్యే వంశీ లేఖ రాయడంపై.. చంద్రబాబు స్పందించారు. వంశీ.. వాట్సాప్ ద్వారా తన లేఖను పంపారు. చంద్రబాబు కూడా.. అదే విధంగా.. తన రిప్లయ్ ఇచ్చారు. అధికారులు వేధిస్తున్నారంటూ… రాజీనామా చేయడం సరి కాదని.. పేద ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల నుంచి విరమించుకున్నంత మాత్రాన.. వదిలి పెట్టరని.. వేటాడతారని గుర్తు చేశారు. రాజీనామా చేయడం లేదా నిష్క్రమించడం సరైన చర్య కాదని స్పష్టం చేసారు. ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా.. పార్టీ తరపున అండగా హామీ ఇచ్చారు.

టీడీపీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. వంశీ వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారుల వేధింపుల వల్లే తానీ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. వైసీపీలో చేరతారనుకున్న వైసీపీ లేఖ ఆ పార్టీకి ఇబ్బంది కరంగా మారింది. ఇప్పటికే టీడీపీ నేతలపై అనేక రకాల వేధింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. అవే తరహా ఆరోపణలు చేసి.. రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకోవడంతో… వైసీపీలోనూ.. కలకలం రేపుతోంది. జగన్ దగ్గరకు తీసుకుపోయిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని.. వంశీ లేఖతో ఇబ్బంది పడటం ఖాయంగా తెలుస్తోంది.

ఏ పార్టీ వేధింపులకు పాల్పడుతోందని.. ఆరోపించి.. టీడీపీకి రాజీనామా చేశారో.. ఇప్పుడు అదే పార్టీలో వంశీ చేరడం.. ఇబ్బందికరమే. అయితే.. ఈ విషయంలో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది. ఇప్పటికే పరిటాల రవి అనుచరునిగా.. వల్లభనేని వంశీకి కొంత ఇమేజ్ ఉంది. ఇప్పుడు పోయి..పోయి ఆయన వైసీపీలో చేరితే.. క్యారెక్టర్ పై మచ్చ పడుతుంది. అదే సమయంలో… టీడీపీలో ఉండి.. ఆయన వైసీపీ నేతల వేధింపుల్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఈ క్రమంలో.. వంశీ ముందు ముందు తీసుకోబోయే నిర్ణయం హాట్ టాపిక్ కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close