జనసేనకు మరో కీలక నేత గుడ్ బై ..!

జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ కల్యాణ్‌కు.. ఆ పార్టీ నేతలు వరుసగా షాక్ ఇస్తున్నారు. జనసేనలో కీలకంగా పని చేస్తున్న చింతల పార్థసారధి అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి చింతల పార్థసారధి పోటీ చేశారు. కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్ నియమించిన కమిటీల్లో.. చింతల పార్థసారధికి ప్రాధాన్య ఇచ్చారు. ప్రస్తుతం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్‌ చైర్మన్ గా ఉన్నారు. మీడియా చర్చల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనే చింతల పార్ధసారధికి మంచి విషయ పరిజ్ఞానం ఉంది. అయితే హఠాత్తుగా ఎందుకు జనసేనకు రాజీనామా చేశారన్నదానిపై జనసేనలోనే రకరకాల ప్రచారం జరుగుతోంది.

కమిటీలు వేసినప్పటికీ.. పెద్దగా కార్యాచరణ లేదని.. పవన్ కల్యాణ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తిలో చింతల పార్థసారధి ఉన్నారని అంటున్నారు. అది మాత్రమే కాకుండా… జనసేన పార్టీలో ఓ మాదిరి వాయిస్ ఉన్న నేతలను అయినా సరే.. ఆకర్షించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉంది. ఇప్పటికే పలువురితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో… చింతల పార్థసారధితోనూ… వైసీపీ నేతలు చర్చలు జరిపారని.. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారని కూడా అంటున్నారు. ఈ విషయంపై.. వైసీపీ నేతలు కానీ.. ఇటు చింతల పార్ధసారధి కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

అయితే.. ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశంతోనే చింతల పార్థసారధి జనసేనకు రాజీనామా చేశారన్న విషయంపై మాత్రం.. ఆ పార్టీ వర్గాలకు క్లారిటీ ఉంది. కారణం ఏదైతేనేం… ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనను పలువురు కీలక నేతలు వదిలి పెట్టారు. ఫలితాలు రాక ముందు.. ఇద్దరు కీలక అధికార ప్రతినిధులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు. జనసేన తరపున పోటీ చేసిన నేతలపై ఇతర పార్టీలు కన్నేయడంతో.. జనసేనకు టెన్షన్ తప్పడం లేదు. బీజేపీ కూడా.. జనసేన నేతలను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close