చిరంజీవికి కిషన్ రెడ్డి ఆహ్వానం – వెళ్లక తప్పుతుందా ?

చిరంజీవి ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ భీమవరంలో అల్లూరి సీతారారారాజు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. వచ్చే నెల నాలుగో తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనాలని… చిరంజీవిని కిషన్ రెడ్డి ఆహ్వానించారు.

నిజానికి ఈ కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. కానీ ప్రధాని మోదీ పాల్గొనే పర్యటన కావడం.. జన సమీకరణ భారీగా చేసే పరిస్థితులు ఏపీ బీజేపీ నేతలకు లేకపోవడంతో చిరంజీవిని ఆహ్వానిస్తే పని సులువు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో బీజేపీ బలపడాలంటే.. ఓ ప్రజాకర్షక నేత అవసరం. గతంలో చిరంజీవితో చర్చలు జరిపారని.. బీజేపీలో చేరుతారని కొన్ని పుకార్లను కూడా పుట్టించారు. కానీ అప్పట్లో చిరంజీవి టెంప్ట్ కాలేదు.

తమిళనాడులో కూడా బీజేపీ ఇలాంటి ఎత్తులే వేసింది. రజనీకాంత్‌తో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించింది. మోదీ, అమిత్ షా కూడా స్వయంగా రజనీకాంత్‌ను కలిశారు. పలు కార్యక్రమాలకు ఆహ్వానించారు. అయితే రజనీ మాత్రం సొంత పార్టీ వైపు మొగ్గారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో చివరి క్షణంలో విత్ డ్రా చేసుకున్నారు. ఏపీలో అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపితే రాలేను అనే పరిస్థితి చిరంజీవికి లేదు. ఆయనకే కాదు ఎవరికీ ఉండదు. ఎందుకంటే.. అలా తిరస్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథలు కథలుగా చెప్పుకుంటారు. అందుకే చిరంజీవి ఖచ్చితంగా ఆహ్వానాన్ని అంగీకరిస్తారు. ఆ తర్వాత బీజేపీ చేసే రాజకీయాన్ని ఆయన మౌనంగా చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close