ఎక్స్‌క్లూజీవ్‌: చిరంజీవితో క‌ల్యాణ్ కృష్ణ‌

బింబిసార ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌తో సినిమా చేయ‌డానికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు… మ‌రో యువ ద‌ర్శ‌కుడి క‌థ‌నీ చిరు ఓకే చేశార‌ని స‌మాచారం. త‌నే… క‌ల్యాణ్ కృష్ణ‌. సోగ్గాడే చిన్ని నాయిన‌, బంగార్రాజు, రారండోయ్ వేడుక చూద్దాం.. చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు క‌ల్యాణ్ కృష్ణ‌. బంగార్రాజు త‌ర‌వాత ఏ సినిమా ఓకే అవ్వ‌లేదు. ఎట్ట‌కేల‌కు చిరుని క‌లిసి.. ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఇది క‌ల్యాణ్ సొంత క‌థేం కాదు. `ధ‌మాకా` రైట‌ర్‌.. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ రాసిన క‌థ ఇది. చిరుకి ఫ‌స్ట్ సిట్టింగ్‌లోనే ఈ క‌థ నచ్చింద‌ని స‌మాచారం. క‌ల్యాణ్ కృష్ణ కుటుంబంతో చిరుకి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. క‌ల్యాణ్ కృష్ణ‌ కుర‌సాల క‌న్న‌బాబు కి క‌ల్యాణ్ బంధువు. ఆయ‌నేమో చిరుకి ఆప్తుడు. ప్ర‌జా రాజ్యం స‌మ‌యంలో… పార్టీలో చేరి గెలిచాడు కూడా. ఆ అనుబంధంతో కూడా చిరు ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం భోళా శంక‌ర్ తో బిజీగా ఉన్నాడు చిరు. ఆగ‌స్టు నుంచి వ‌శిష్ట చిత్రం మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. క‌ల్యాణ్ కృష్ణ సినిమానీ సమాంత‌రంగా ప‌ట్టాలెక్కిస్తార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close