జగన్ రెడ్డి సర్కార్‌కు చిరంజీవి వాతలు !

సినీ పరిశ్రమ కోసం తనను అవమానించినా ఓర్చుకున్నా చిరంజీవి పదే పదే టాలీవడ్‌పై ఏపీ సర్కార్ దాడి చేయడాన్ని సహించలేకపోయారు. ఇంత కాలం బహిరంగంగా ఒక్క మాట కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడని ఆయన.. సందర్భం చూసుకుని ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎక్కడా ఏపీ ప్రభుత్వం అనే మాట ఎత్త లేదు కానీ.. ఏపీ సర్కార్ ఇండస్ట్రీ విషయంలో చేస్తున్న ప్రతి వ్యవహారాన్ని.. రాజకీయ అంశాలతో ముడి పెట్టి కడిగేశారని అనుకోవచ్చు.

‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. అందులో మాట్లాడిన చిరంజీవి ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని చిరంజీవి వ్యాఖ్యానించారు. సాధారణంగా చిరంజీవి సినిమా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఇతర విషయాల గురించి మాట్లాడరు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించడం చర్చనీయమైంది.

అదే సమయమంలో తనతో దండం పెట్టించుకున్న అంశాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించారు. మంచి చేస్తే ప్రజలే చేతులెత్తి మొక్కుతారని గుర్తు చేశారు. టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల హీరోల రెమ్యూనరేషన్ల గురించి విజయసాయిరెడ్డి ఏకంగా పార్లమెంట్ లోనే ప్రస్తావించారు. వీటన్నింటితో.. టాలీవడ్ పై ఏపీ సర్కార్ తీరుపై ఇక సైలెంట్ గా ఉండకూడదని చిరంజీవి డిసైడయినట్లుగా చెబుతున్నారు.

చిరంజీవి ప్రత్యేక- హోదా ప్రస్తావవ తీసుకు రావడం.. రాజకీయంగా వ్యూహాత్మకమేనన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మెడలు వంచుతామని ఓట్లు పొంది.. ఇప్పుడు ప్రజల్ని మోసం చేశారని.. ఇటీవల ప్యాకేజీ డబ్బులు కూడా తీసుకున్నారని.. ఈ అంశాన్ని ప్రజల్లో హైలెట్ చేసేందుకు ఈ మాట మాట్లాడారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇంత కాలం చిరంజీవి నోరు ఎత్తట్లేదని ఆయన పేరు వాడేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడేమంటారో వేచి చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close