వినాయ‌క్‌కి మాటిచ్చిన చిరు

`లూసీఫ‌ర్‌`ని తెలుగులో రీమేక్ చేయాల‌ని ఆశ ప‌డ్డాడు చిరంజీవి. ఆ బాధ్య‌త ముందుగా… సుజిత్ కి అప్ప‌గించాడు. ఆ తర‌వాత చేతులు మారి, వినాయ‌క్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఇప్పుడు వినాయ‌క్ కూడా ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఇప్పుడు ఆ అవ‌కాశం ఎవ‌రికి వెళ్తుందో చూడాలి. అయితే ముందు నుంచీ ఈ రీమేక్‌పై వినాయ‌క్ ఆస‌క్తి చూపించ‌లేద‌ని తెలుస్తోంది. తెలుగులో లూసీఫ‌ర్ వ‌ర్క‌వుట్ కాద‌న్న‌ది వినాయ‌క్ భావ‌న‌. అందుకే…చిరుకి సున్నితంగా `నో` చెప్పాడు. కానీ చిరు బ‌ల‌వంతం చేయ‌డంతో స్క్రిప్టు వ‌ర్క్ మొద‌లెట్టాడు. కానీ ఈ క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఎంత చేసినా.. సెకండాఫ్ ఓకే కాక‌పోవ‌డం వ‌ల్లే, వినాయ‌క్ ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం.

అయితే.. చిరు, వినాయ‌క్ కి ఓ మాటిచ్చాడ‌ట‌. `కొత్త క‌థ చేసుకురా.. అప్పుడు మ‌నం క‌లిసి ప‌నిచేద్దాం` అన్నాడ‌ట‌. వినాయ‌క్ కూడా ఇప్పుడు చిరు కోసం కొత్త క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. లూసీఫ‌ర్ రీమేక్‌కి స‌రైన ద‌ర్శ‌కుడు దొరికి, స్క్రిప్టు చిరు అనుకున్న రీతిలో వ‌స్తే.. లూసీఫ‌ర్ రీమేక్ ఉంటుంది. లేని ప‌క్షంలో ఇదే స్థానంలో వినాయ‌క్ తో, కొత్త క‌థ‌తో సినిమా మొద‌ల‌వుతుంద‌ని చిరు కాంపౌండ్ వ‌ర్గాలు తెలిపాయి. లూసీఫ‌ర్ రీమేక్ హ‌రీష్ శంక‌ర్ చేతికి వెళ్లింద‌న్న వార్త‌లు వ‌స్తున్నా.. అందులో స్ప‌ష్ట‌త లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close