పోలవరం ఎత్తు తగ్గింపు..! జగన్ ఓకే అన్నారని కేసీఆర్ ప్రకటన..!

పోలవరం ప్రాజెక్ట్ రీడిజైన్ జరుగుతోందా…? తెలంగాణలో ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేసిన… తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఇది జరుగుతోందా..? అవుననే అంటున్నారు… తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు వల్లే… ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని… ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని.. తాను జగన్ కు సూచించానని.. దానికి ఆయన అంగీకరించారని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మహారాష్ట్రతో తాము జల వివాదాలు పరిష్కరించుకున్నట్లుగానే పరిష్కరించుకోవాలని జగన్ కు సలహా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నారు.

ఉమ్మడి ప్రాజెక్టు విషయంపై.. జరిపిన చర్చల సమయంలోనే… దీనిపై చర్చించి ఉంటారని.. ఈ మేరకు.. జగన్ పోలవరం ఎత్తు తగ్గించేందుకు అంగీకరించి ఉంటారని.. అదే విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని భావిస్తున్నారు. నిజానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. అన్ని రకాల ప్రక్రియలు పూర్తయిపోయాయి. 71 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది. అయినప్పటికీ.. ఇప్పుడు.. తెలంగాణ సీఎం సూచనతో.. ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించడం సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. అది జాతీయప్రాజెక్టు. కేంద్రమే నిర్మిస్తోంది. ఆ ప్రాజెక్టు బాధ్యత కూడా కేంద్రానిదే. కేవలం నిర్మాణ నిర్వహణ బాధ్యతలు మాత్రమే ఏపీ సర్కార్ చూస్తోంది.

అలాంటిది.. ఎవరికి.. ఎలాంటి సమాచారం.. చర్చలు…పరిణామాలపై ఆలోచనే చేయకుండా… పోలవరం ఎత్తు తగ్గింపునకు జగన్ అంగీకరించారని కేసీఆర్ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కొద్ది రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదంగా ఉంటున్నాయి. రివర్స్ టెండరింగ్ కానీ… కాంట్రాక్టర్ల తొలగింపు కానీ.. కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక కానీ… అన్నీ న్యాయవివాదాల్లో ఇరుక్కుపోయేలా చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో… కేసీఆర్ అసెంబ్లీలో.. పోలవరం ఎత్తు తగ్గింపు ప్రకటన… సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close