చెన్నై కోసం రూ.260 కోట్లు విరాళం ప్రకటించిన కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థ

చెన్నైలోని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థ చెన్నై వరద భాధితుల సహాయార్ధం ఏకంగా రూ.260 కోట్లు విరాళం ప్రకటించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో శాఖలు కలిగిన కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థకి అత్యధికంగా చెన్నైలోనే 60, 000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కనుక భారత్ లో అదే ప్రధాన కేంద్రంగా భావించవచ్చును. చెన్నై పరిస్థితి చూసి చలించిపోయిన ఆ సంస్థ యాజమాన్యం ఈ భారీ విరాళాన్ని నేడు ప్రకటించింది. అందులో రూ.65 కోట్లు నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తారు. మిగిలిన రూ. 195 కోట్లను సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్న వివిధ సంస్థలకు అందజేసి వాటి ద్వారా ఖర్చు చేయబోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ నుండి ఇంత భారీ విరాళం అందడం బహుశః ఇదే మొదటిసారి అని చెప్పవచ్చును. కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్ సంస్థను ఆదర్శంగా తీసుకొని రిలయన్స్ వంటి పెద్ద సంస్థలు కూడా స్పందిస్తే బాగుంటుంది.

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తే, చెన్నైకి చెందిన సూపర్ స్టార్ రజనీ కాంత్ కేవలం రూ.10 లక్షలు మాత్రమే విరాళం ప్రకటించడం విశేషం. ఆయన నటించిన అనేక సినిమాలు వరుసగా విఫలం అవుతుండటంతో, ఆయన కొంతమంది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సొమ్ము వాపసు చేస్తున్నందున ఆర్ధిక సమస్యలో ఉండి ఉండవచ్చును. అందుకే అంత తక్కువ విరాళం ఇచ్చేరేమో? అల్లు అర్జున్, సురియా, కార్తి చెరో రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చేరు. హాన్సిక-15 లక్షలు, మహేష్ బాబు, విశాల్ చెరో 10 లక్షలు, రవితేజ, కళ్యాణ్ రామ్ చెరో 5 లక్షలు, వరుణ్ తేజ్-3 లక్షలు, సంపూర్ణేష్ బాబు-రూ.50, 000 విరాళాలు అందించేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close