సాగర్‌లో గులాబీకే రెడ్ సపోర్ట్..!

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో కమ్యూనిస్టు పార్టీల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ఆ పార్టీలు బరిలో లేవు. దాంతో ఆ పార్టీలు మద్దతిస్తే ప్లస్ పాయింట్ అవుతుందని కాంగ్రెస్, టీఆర్ఎస్ భావిస్తున్నాయి. టీఆర్ఎస్ కన్నా ముందుగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఆ పార్టీ కార్యదర్శులకు లేఖ రాశారు. మద్దతివ్వాలని కోరారు. ఆ లేఖపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సమాచారం ఇచ్చిన ఆ పార్టీ నేతలు ఇంత వరకూ స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా కమ్యూనిస్టుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూండటంతో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. చివరికి ఇప్పుడు మధ్యేమార్గంగా అధికారికంగా ప్రకటించకుండా లోపాయికారీగా టీఆర్ఎస్‌కే మద్దతివ్వాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉభయకమ్యూనిస్టు పార్టీల సానుభూతిపరులు దాదాపుగా పది వేల మంది వరకూ ఉంటారు. కమ్యూనిస్టుల పార్టీల కార్యకర్తలకు విధేయత ఎక్కువ. పార్టీ ఎవరిని సమర్థించమంటే వారినే సమర్థిస్తారు. అందుకే ఎక్కడ పోటీ చేసినా వారి ఓటు బ్యాంక్ వారికి ఉంటుంది. ఇప్పుడు… సాగర్‌లో ఆ ఓటు బ్యాంక్ ఎవరికో ఒకరికి మద్దతివ్వక తప్పని పరిస్థితి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గతంలో చాలా కాలం పాటు కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వలేదు.

అయితే రాష్ట్ర నాయకత్వానికి హుజూర్ నగర్ ఉపఎన్నికల సందర్భంగా మాత్రం ప్రగతిభవన్‌కు పిలిచి… భోజనం పెట్టి… బయట వరకూ తీసుకొచ్చి వీడ్కోలు చెప్పి వెళ్లారు. అవసరానికి మించి ఆదరణ చూపిస్తూండటంతో కమ్యూనిస్టులు కూడా కరిగిపోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి కేసీఆర్‌కు కోపం తెప్పించడం కన్నా… అధికారికంగా ప్రకటించకుండా… లోపాయికారీగా టీఆర్ఎస్‌కు మద్దతివ్వడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close