జగన్‌పై ఢిల్లీలో బీజేపీ వరుస ఫిర్యాదులు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్‌గా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో సీబీఐ కోర్టు పెట్టాలంటూ.. ఉదయం రవిశంకర్ ప్రసాద్‌కు.. వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నేతలు.. సాయంత్రం.. మరో బ్యాచ్‌గా అమిత్ షాను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలపై… వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఫిర్యాదు చేశారు. అయితే… రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన బృందానికి.. అమిత్ షా కలిసిన బృందానికి తేడా చూపించారు. రెండూ వేర్వేరు బృందాలు. రెండింటిలోనూ.. విష్ణువర్ధన్ రెడ్డి లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గంగా ప్రచారం పొందిన వారు.. జగన్ పై ఫిర్యాదులకు దూరంగా ఉంటున్నారు. కానీ నిఖార్సైన బీజేపీ వాదులు మాత్రం.. జగన్ రెడ్డి సర్కార్ పై ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు.

టీడీపీ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరుతుందే రక్షణ కోసం. బీజేపీ బలం పుంజుకుందని.. ఏపీలో దున్నేస్తుందని కాదు. ఆ రక్షణ కూడా.. బీజేపీలో చేరినా లేదన్న భావన.. ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ బీజేపీ నేతలనూ వదిలి పెట్టడం లేదు. బీజేపీలో చేరిన జమ్మలమడుగు నేత ఆదినారాయణరెడ్డికి… వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. అలాగే.., జిల్లాల్లోనూ… బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. దీన్ని బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. ఇలా బెదిరింపులకు దిగడమే కాదు.. బీజేపీ నేతల్ని.. వైసీపీలో చేర్చుకునేందుకు దూకుడుగా వెళ్తున్నారు కూడా..!

భారతీయ జనతా పార్టీని వైసీపీ టార్గెట్ చేసిందని.. ఆ పార్టీ నేతలకు.. క్లారిటీ వచ్చింది. ఇప్పటికైనా మేలుకోకపోతే.. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని తిన్న దెబ్బల కన్నా.. ఎక్కువగా .. జగన్ చేతిలో చావుదెబ్బ తినాల్సి వస్తుందన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే.. ఢిల్లీ వ్యూహకర్తలు.. ఫిర్యాదుల వ్యూహానికి తెర తీసినట్లుగా కనిపిస్తోంది. విజయవాడలో సీబీఐ కోర్టు పెట్టడం… అమిత్ షాకు.. బీజేపీ నేతల ఫిర్యాదులు.. తదుపరి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రణాళిక ప్రకారం జరిగినట్లుగా చెబుతున్నారు. అదే నిజమైతే.. కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు ఖాయం అని అనుకోవచ్చు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close