ఏపీ బీజేపీ అధికార పార్టీ కూటమిలో ఉంది. ఆ పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్నారు. కారణం ఏదైనా ఆమెను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి వర్గం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి బీసీ వర్గం నుంచి ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, పీవీఎన్ మాధవ్ , కమ్మ వర్గం నుంచి సుజనా చౌదరి ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.
నిజానికి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నా చేసేదమీ ఉండదు. పార్టీ బలోపేతానికి పోరాటాలు చేయాల్సిన పని కూడా ఉండదు. కానీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చాలా వరకూ పనులు చక్కబెట్టుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే చాలా మంది ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రతీ సారి ఆంధ్రా ప్రాంతానికి.. కమ్మ, కాపు సామాజికవర్గాలకు చాన్స్ ఇస్తున్నారని.. రాయలసీమ రెడ్డి వర్గానికి ఈ సారి అవకాశం ఇవ్వాలని కొంత మంది లాబీయింగ్ చేసుకుంటున్నారు.
రాజకీయ సమీకరణాలు. . కూటమి బలంగా ఉందన్న సంకేతాలు ఇచ్చేలా పార్టీ అధ్యక్ష పదవి ఉండాలని కూటమిలోని ఇతర పార్టీలు కోరుకుంటాయి. అయితే బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో వారు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఆయా పార్టీల మనోభావాలను కూడా బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సి ఉంటుంది. ఇవాళ, రేపట్లో అధ్యక్షుడు ఎవరో తెలిపోయే అవకాశం ఉంది. మార్చడం ఎందుకనుకుంటే పురందేశ్వరినే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.