జానారెడ్డికి సీన్ అర్థమయింది..!

నేను సీనియర్‌ని .. నాకెవరూ ప్రచారంచేయాల్సిన అవసరం లేదు.. నేనొక్కడినే చేసుకుంటానని భీష్మించుకు కూ‌ర్చున్న జానారెడ్డికి .. నాగార్జున సాగర్‌లో పరిస్థితి అర్థమైపోయింది. ఓ వైపు టీఆర్ఎస్ బలగం మొత్తాన్ని దించి గ్రామాలను చుట్టబెడుతోంది. మరో వైపు కేసీఆర్ కూడా ప్రచారానికి వస్తున్నారు. దీంతో జానారెడ్డి… తన పట్టు సడలించుకోక తప్పలేదు. సీనియర్ల ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రేవంత్ సహా కీలకనేతలందరూ మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని రంగంలోకి దిగారు. సాగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు..రెండు మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిలో నేటి నుంచి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయనున్నారు.

జానారెడ్డి ఇంతకు ముందు రెండు విధాలుగా ఆలోచించారు. ఒకటి.. ఉపఎన్నికల్లో ఎవరి సాయం లేకుండా గెలిస్తే… తెలంగాణ కాంగ్రెస్‌లో తనకంటే పోటుగాడు లేడన్న ఇమేజ్ వస్తుందని .. అలాగే… ఒక్క సారిగా కాంగ్రెస్‌లో కీలక స్థానానికి వెళ్లిపోవచ్చని ఆశపడ్డారు. అయితే అనుకున్నంత ఈజీగా పరిస్థితి లేదని తేలిపోయిన తర్వాత మెత్తబడాల్సి వచ్చింది. జానారెడ్డి సీనియర్ కావొచ్చు కానీ… ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ దశలో ఉన్నారు. కుమారుడి ద్వారా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు సీరియస్‌గా తీసుకోకపోతే.. చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకున్న చందంగా అవుతుందన్న నిర్ణయానికి రావడంతో తన పట్టు సడలించారు.

జానారెడ్డి అంగీకరించడంతో ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ పదవుల్లో ఉన్న వారు.. సీనియర్లు అందరూ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. వారిని మండలాల వారిగా ఇంఛార్జీలుగా నియమించారు. వీరికి మరో పదిమంది డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులను బృందంగా అప్పగించారు. సాగర్‌లో ప్రస్తుతం పరిస్థితి హోరాహోరీగా ఉంది.ఏ పార్టీకి మొగ్గు లేని పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలుగు రాష్ట్రాల్లో నామినేష‌న్లు షురూ…

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి మ‌రింత ప‌దునెక్క‌నుంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారం నుండి మొద‌ల‌వుతుండ‌టం, మంచి రోజు కావ‌టంతో మొద‌టి రోజే నామినేష‌న్లు భారీగా దాఖ‌ల‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏపీలో అసెంబ్లీకి, లోక్...

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close