రాయలసీమలో ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్ టార్గెట్..!?

కర్నూలులో రాహుల్ గాంధీకి సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నేతల వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఏపీలో కాంగ్రెస్ కు ఊపిరి లేదని అందరూ భావిస్తున్న తరుణంలో.. రాయలసీమలో… పార్టీ ఉనికి ఉందని… రాహుల్ సభ నిరూపించినట్లయింది. సభకు … సంతృప్తికర స్థాయిలో జనసమీకరణ చేయడంలో కోట్ల, బైరెడ్డితో పాటు ఇతర నేతలు కూడా సక్సెస్ అయ్యారు. రాహుల్ సభతో కాస్తో కూస్తో ఊపు వస్తుందని.. ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ గాంధీ స్పష్టమైన భరోసా ఇచ్చాక నమ్మకం చిక్కిందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు చేరిన తర్వాత … కాంగ్రెస్ కు ఇంత కాలం అండగా నిలబడిన సామాజికవర్గంలో తమకు ఆదరణ పెరుగుతుందన్న అంచనాలను ఆ పార్టీ నేతలు వేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గమ్యమూ కనిపించడం లేదు. ఏ వర్గం ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్ వైపు లేదు. దూరమైన ఓటు బ్యాంకుల్ని దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. దీనికి ప్రత్యేకహోదా అంశం ఉపయోగపడుతోంది. కిరణ్, బైరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.. ఆ తరువాత వైసీపీపై దాడిని తీవ్రం చేస్తూండటంతో …రాజకీయంగా కొంత సమీకరణాలు మారే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొంత మంది బలమైన నేతలు చేరడంతో వారితో పాటు క్యాడర్ కూడా.. కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఒక్క సారి కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న భావన ప్రజల్లోకి వస్తే పాత క్యాడర్ అంతా మళ్లీ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవడం ఖాయమే . కాంగ్రెస్ పార్టీ బలపడటం ప్రారంభిస్తే.. ఆ పార్టీకి మొదటి నుంచి ఓటు బ్యాంక్ గా ఉన్న మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ విషయంలో వైసీపీ మెతక వైఖరితో ఉండటంతో ఈ వర్గాలు ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్నాయన్న ప్రచారం ఉంది. పైగా జగన్ తో సహా వైసీపీ నేతల వ్యవహారశైలి… వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మింగుడు పడేలా లేదు. ప్రత్యామ్నాయం లేకనే వాళ్లు వైసీపీలో ఉండిపోతున్నారు. కాంగ్రెస్ పుంజుకుటుందని.. కర్నూలు సభతో కాస్తంత నమ్మకం కలిగించారు కాబట్టి.. ఇక పరిస్థితులు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలు సభలో కాంగ్రెస్ నేతలు వైసీపీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించి తమ ఉద్దేశాన్ని నేరుగానే చెప్పారు.

రాయలసీమలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో అనంతపురం మినహా మిగతా జిల్లాల్లో పట్టు నిరూపించుకుంది. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి తారుమరయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. చేరికలు, ప్రత్యేకహోదా నినాదాలతో.. కనీసం ఐదు శాతం ఓట్లు చీల్చుకున్నా.. ఆ మాత్రం. వైసీపీకి మైనస్ అవుతాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ వ్యూహం గెలవడం కాకపోవచ్చు. వైసీపీ బలహీనపడితేనే తాము బలపడతామని కాంగ్రెస్ కు బాగా తెలుసు. అందుకే తాము బలపడి.. వైసీపీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కర్నూలు సభతో ఓ అడుగు ముందుకేసినట్లే..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close