కోవాగ్జిన్ టీకా వేసుకున్న మంత్రికి కరోనా వచ్చేసింది..!

భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న టీకాను.. ప్రయోగాత్మకంగా వేసుకున్న వాలంటీర్లలో ఒకరైన హర్యానా ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత నెల ఇరవై ఎనిమిదిన ఆయనకు మొదటి డోస్ టీకా వేశారు. అంతా సవ్యంగా ఉందనుకున్న దశలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. దీంతో కోవాగ్జిన్ టీకాపై చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. అయితే.. కోవాగ్జిన్ టీకా రెండు డోసులు వేసుకున్న తర్వాత పధ్నాలుగు రోజులకు .. యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. అనిల్ విజ్.. ఒక్క సారి మాత్రమే టీకా డోస్ తీసుకున్నారని రెండో డోస్.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత నెల రోజులకు ఇస్తామని.. కానీ దురదృష్టవశాత్తూ.. అనిల్ విజ్ ఈ లోపే.. కరోనా బారిన పడ్డారని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.. కరోనాను తరిమికొట్టవచ్చని కేంద్రం కూడా.. ఆశాభావంతో ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా.. భారత్ బయోటెక్ కు వచ్చి చూసి వెళ్లారు. వ్యాక్సిన్ పంపిణీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ బయోటెక్ ఇప్పటికే రెండు విడతల ప్రయోగాలు పూర్తి చేసింది. మూడో విడత చేస్తోంది. ఇప్పటి వరకూ అరవై శాతానికిపై సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ ఉందని భారత్ బయోటెక్ చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులు రావాలంటే.. కనీసం యాభై శాతం సామర్థ్యం ఉండాలి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఇలాంటి వార్తలు బయటకు వచ్చే కొద్దీ.. ఆ వ్యాక్సిన్ సామర్థ్యంపై సందేహాలు ప్రారంభమవుతాయి. అంటే… కోవాగ్జిన్ ప్రభావంపై ఇక ముందు ఇంకా ఎక్కువ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో భారత్ బయోటెక్ మరింత ఒత్తిడికి గురి కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close