నవంబర్ ఒకటి జగన్‌కు “డి- డే”..!

అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు హాజరయ్యే విషయంలో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందో లేదో అన్న విషయం నవంబర్ ఒకటో తేదీన తేలనుంది. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు పూర్తయ్యాయి. అటు జగన్ తరపు న్యాయవాదులు.. ఇటు సీబీఐ లాయర్లు తమదైన వాదన వినిపించారు. న్యాయమూర్తి తీర్పును నవంబర్ ఒకటో తేదీకి రిజర్వ్ చేశారు. జగన్ పిటిషన్‌కు వ్యతిరేకంగా సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేయడంతో… నేటి విచారణపై.. అందరిలోనూ ఆసక్తి వ్యక్తమయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే.. ఆయనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలనే ఏకైక కోణంలోనే.. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు రావాలంటే.. రెండు రోజుల సమయం వృధా అవుతుందని… జగన్ లాయర్లు కోర్టులో వాదించారు. దాంతో పిటిషన్లో పేర్కొన్నట్లుగా ప్రజాధనం.. ఇతర అంశాలనూ.. వివరించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పైనా.. తమదైన వాదనలు వినిపించారు. అయితే.. అందులో అంశాలకు వ్యతిరేకంగా బలమైన వాదన అంటే.. ప్రతీ అంశానికి .. జగన్ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. సీబీఐ కౌంటర్ పిటిషన్‌లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి అని సంబోధించలేదని.. జగన్ లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో.. కోర్టులో ఉన్న ఇతరులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. కేసు ఏపీ ముఖ్యమంత్రిపై కాదని.. జగన్ పై ఉందన్న విషయాన్ని జగన్ లాయర్లు ఎందుకు మర్చిపోయారన్న సెటైర్లు పడ్డాయి.

సీబీఐ కూడా.. కౌంటర్‌లో పేర్కొన్న అన్ని అంశాలను న్యాయస్థానం ముందు ఉంచింంది. జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వవద్దని స్పష్టం చేసింది. గతంలో సీబీఐ కోర్టు, హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వలేదని వాదించారు. అయితే.. అప్పుడు జగన్ సీఎంకాదని.. ఇప్పుడు జగన్ సీఎం అన్న వాదనను జగన్ లాయర్లు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నవంబర్ ఒకటో తేదీకి రిజర్వ్ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close