వైసీపీలో అందరూ సైకోలే ఉంటారని మరోసారి నిరూపితమయింది. జోగి రమేష్ ఇంట్లో శుభకార్యం జరుగుతూంటే.. రాజకీయంగా ర్యాలీ నిర్వహించారు. అంతేనా వారు వెళ్లే దారిలో ఓ చిన్న పిల్లవాడు .. చిన్న సైకిల్ తొక్కుకుంటూ ఉంటే..దాన్ని లాక్కుని విసిరి కొట్టి పైశాచిక ఆనందం పొందారు. తన సైకిల్ ఎందుకు లాక్కున్నారో.. తెలియని ఆ పిల్లవాడు బిక్కచచ్చిపోయాడు. వారు ఆ సైకిల్ తన సైకోతనం చూపించిన తర్వాత మిగిలిన సైకిల్ ను తీసుకెళ్లాడు.
ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బలహీనుడు.. పిల్లవాడు ఏమీ చేయలేదని అతని వద్ద సైకిల్ లాక్కుని చూపించిన సైకోతనం చూసి ఎవరికైనా భయం వేస్తుంది. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులపై ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారో ఈ ఘటనే సాక్ష్యంగా కనిపిస్తోంది. సైకిల్ అనేది టీడీపీ గుర్తు కావొచ్చు అంత మాత్రాన అంత సైకోతనం చూపించాల్సిన అవసరం ఏముంది ?
ఇలాంటి సైకోలు ఐదు సంవత్సరాల పాటు.. తమ ఘోరాలు చేశారు. వారిని పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేశారు. బలహీనులు, పిల్లలు ఎదురుపడితే కనీసం విచక్షణ కూడా ఉండకుండా ప్రవర్తిస్తారని మరోసారి నిరూపితమయింది. ఇలాంటి వారిపై ఎన్ని కేసులు పెట్టి..ఎన్ని రోజుల్లో జైల్లో ఉంటే మార్పు వస్తుంది. జగన్ రెడ్డి పార్టీ క్యాడర్ ను ఇలా తయారు చేశారు. జనంపైకి రాక్షసుల్ని వదిలారని నెటిజన్లు ఉగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. వైసీపీ ఎప్పటికీ మారదని వారికి శాశ్వత రాజకీయ సమాధి కట్టడమే మార్గమన్న అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు.