రోజా : తలెగరేస్తున్నందు వల్లనే తలనొప్పులు

ఎమ్మెల్యే రోజా వైఖరి రోజు రోజుకు పీటముడి లాగా బిగుసుకు పోతున్నట్లున్నది. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి కూడా ఆమె డుమ్మా కొట్టడం, దానికి అనారోగ్యం పేరిట సాకులు చెప్పడం, ఇలాంటి చర్యలన్నీ కూడా మరింత ప్రతిష్టంభన కు దారి తీసేలా ఉన్నాయే తప్ప.. సమస్య ను సామరస్య వాతావరణంలో ఒక కొలిక్కి తెచ్చేందుకు ఉపయోగపడేలా లేవు. పైగా సొంత పార్టీలోనే నలుగురు ఎమ్మెల్యేలు జరిగిన పరిణామాలకు సంబంధించి సారీ చెప్పేసిన తర్వాత కూడా రోజా ఇంకా సాకులు చెప్పుకుంటూ రోజులు వెళ్లదీయాలనుకుంటే.. ముందు ముందు మరింత ఇబ్బందులు తప్పవని పలువురు అంచనా వేస్తున్నారు. శనివారం సమావేశానికి వచ్చి వివరణ ఇచుకోవాల్సిందిగా పిలిస్తే… రోజా అనారోగ్యం అనే సాకు చెప్పారనే అనుకుందాం… మరి గతంలో మూడు సమావేశాలకు కూడా ఎగ్గొట్టినందుకు ఎలాంటి సంజాయిషీ ఇచుకుంటారు. అందుకే… రోజా తల ఎగరేస్తున్న కొద్ది, ప్రభుత్వంతో సున్నం పెట్టుకోవడమే తన ఎజెండా గ ప్రొసీడ్ అయినంత వరకు ఆమెకు ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు.

వైసీపీ లొనే సభలో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణల మీద అయిదుగురు ఎమ్మెల్యేలను ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలిస్తే… నలుగురు కమిటీ ఎదుట క్షమాపణలు చెప్పారు. రోజా ఒక్కటే కమిటీ ని ఎవాయిడ్ చేస్తున్నట్లుగా ఈ పరిణామాలు ఒక అభిప్రాయం కలిగిస్తున్నాయి. సొంత పార్టీ లోనే రోజాపై సహచర ఎమ్మెల్యేల మద్దతు లేకుండా పోయిందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వైసీపీ లొనే నలుగురు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణలు చెప్పేశారు. అయితే రోజా మాత్రం కనీసం హాజరు కూడా కాలేదు. ఆమె మీద ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనిత మాత్రం కమిటీ ముందుకు వచ్చి తన ఫిర్యాదు ను మళ్లీ నివేదించుకున్నారు. ఇంతా బయటా కూడా అవమానాలు మాత్రమే ఎదురయ్యేలా రోజా తనను అవమానించారని ఆమె చెప్పుకున్నారు. రోజా సభలో తనను అవమానించింది గనుక… అదే సభలో తనకు క్షమాపణ చెబితే సరిపోతుందని ఆమె కోరుతున్నారు. అయితే కమిటీ ముందుకు రావడాన్నే అవొయిడ్ చేస్తున్న రోజా.. సభలో ఆమెకు సారీ చెప్పేంత సహృదయత తో ఉంటుందని అనుకోవడం భ్రమ. అందుకే… రోజా వ్యవహారం… ఆమె తల ఎగరేస్తున్న కొద్దీ మరింతగా ముదిరిపోనున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close