సోనియా, రాహుల్ గాంధీలకు డిల్లీ హైకోర్టులో చుక్కెదురు!

రాజకీయ పార్టీలకి మీడియాకి ఉన్న అవినాభావ సంబందం గురించి కొత్తగా చెప్పుకొనవసరం లేదు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు నేరుగా తమ స్వంత మీడియానే ఏర్పాటు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బహుశః అటువంటి ప్రయత్నంలోనే నేషనల్ హెరాల్డ్ పత్రికకి 2010 సం.లో రూ. 90 కోట్ల రుణం ఇచ్చినట్లుంది. కానీ ఆ పత్రిక మూతపడటంతో ఆ డబ్బును తిరిగి రాబట్టుకోలేక దానిని వసూలు చేసుకొనే హక్కును కారుచవకగా యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి రూ.50 లక్షలకే అమ్మేసింది. కానీ ఆ నిధులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు చాలా తెలివిగా ఈవిధంగా తమ ఖాతలలోకి మళ్ళించుకొన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ డిల్లీ మాజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు.

సోనియా, రాహుల్ గాంధీలతో బాటు సుమన్ దూబే, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలను ప్రతివాదులుగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ని విచారణకు చేపట్టిన కోర్టు వారందరినీ వ్యక్తిగతంగా కోర్టుకి హాజరుకావలసిందిగా ఆదేశించింది. సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ కోర్టు ఆదేశాలను డిల్లీ హైకోర్టులో సవాలు చేస్తూ తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ వారి అభ్యర్ధనను డిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. కేసు విచారణలో కొన్ని ప్రశ్నలకు వారిరువురు స్వయంగా సమాధానం చెప్పవలసి ఉన్నందున తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావలసిందేనని తీర్పు చెప్పింది. కనుక వారిరువురూ మళ్ళీ నేడు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసి హైకోర్టు తీర్పును సవాలు చేసి, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరబోతున్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా వారి అభ్యర్ధనను తిరస్కరించినట్లయితే వారిరువురూ తప్పనిసరిగా కోర్టు వాయిదాలకు హాజరు కావలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close