క్రైమ్ : ఐ ఫోన్ ఆర్డర్ ఇచ్చి డబ్బుల్లేవని డెలివరీ ఏజెంట్ హత్య !

ఐ ఫోన్ కొనాలనుకున్నాడు. కొన్నాడు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టాడు. కానీ డబ్బుల్లేవు. కానీ ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఎలాగైతేనేం అతని చేతుల్లో ఐ ఫోన్ ఉంది. ఇంతకీ ఏం చేశాడంటే.. డెలివరీ బాయ్‌ను చంపేశాడు.. తన ఫోన్ తీసుకెళ్లిపోయాడు. ఒళ్ల గగుర్పొడిచే ఇలాంటి ఆలోచన.. ఆ కర్ణాటక ఉన్మాదికి వచ్చింది.

కర్నాటక హసన్ జిల్లాకు చెందిన 20 ఏండ్ల హేమంత్ దత్తా ఆన్లైన్లో రూ.46,000లకు ఐ ఫోన్ బుక్ చేసుకున్నాడు. ఈ నెల 7న ఈ కార్ట్ ఎక్స్ ప్రెస్ డెలివరీ ఏజెంట్ ఫోన్ డెలివరీ ఇచ్చేందుకు హేమంత్ ఇంటికి వచ్చాడు. అయితే హేమంత్ వద్ద డబ్బులు లేకపోవడంతో డెలివరీ ఏజెంట్ను డబ్బు డ్రా చేసుకొని వస్తానని నమ్మించడంతో ఏజెంట్ ఓకే చెప్పాడు. ఇదే అదునుగా నిందితుడు ఇంట్లోకి వచ్చిన డెలివరీ బాయ్ను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు.

4 రోజులు పాటు శవాన్ని బాత్‌రూంలో శవాన్ని దాచిన హేమంత్ దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గోనె సంచిలోకి మార్చాడు. తన బండిపై దగ్గరలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. 4 రోజులైనా తమ్ముడు ఇంటికి రాకపోవడంతో డెలివరీ ఏజెంట్ సోదరుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుని కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చివరగా హేమంత్ దత్తాను కలిసినట్లు తేలడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

హేమంత్ డెలివరీ బాయ్ డెడ్ బాడీని తన బైక్ పై తీసుకెళ్తుండటం, బాటిల్ లో పెట్రోల్ కొంటున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీలో గుర్తించారు. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close