దాడుల కోసం మహిళా ముఠాలు ఏర్పాటు చేసుకున్న దేవినేని అవినాష్ !

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ నవ్వుల పాలవుతున్నారు. ఆయన తరపున ఎవరినైనా ప్రశ్నిస్తే.. ఓ పది, ఇరవై మంది మహిళల ముఠాను దాడులకు పంపుతున్నారు. కేసులు ఉండవని.. భరోసా ఇచ్చి ఇలా దాడులకు పంపుతున్న వ్యవహారం విజయవాడలో చర్చనీయాంశం అవుతోంది. టీడీపీ నేత పట్టాభిరాం ఇంటిపై రెండు సార్లు జరిగిన దాడుల్లో దేవినేని అవినాష్ పంపిన మహిళా ముఠానే సీసీ కెమెరాల్లో దొరికింది. వారిపై కేసులేమీ పెట్టకపోవడంతో భరోసా లభిచినట్లయింది. ఇదేదో బాగుందని ఆయన కూడా ఆ మహిళా ముఠాలను దాడులకు వాడుకుంటున్నారు.

తాజాగా తన నియోజవర్గంలో గడప గడపకూ వెళ్లిన ఆయనకు ఓ కుటుంబం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాతి రోజు ఉదయమే ఇరవై మంది మహిళల ముఠా.. ఆ కుటుంబంపై దాడికి దిగింది. కుటుంబం కళ్లల్లో కారం కొట్టి దాడులకు ప్రయత్నించింది. దీంతో ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సి వచ్చింది. విచిత్రంగా పోలీసులు ఆ కుటుంబాన్నే పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టారు. దాడులు చేసిన వారిని పట్టించుకోలేదు.

దేవినేని అవినాష్ తండ్రి నెహ్రూ విజయవాడలో .. ఓ వర్గానికి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఏదైనా డైరక్ట్ రాజకీయాలు చేసేవారు. అయితే ఆయన వారసుడు మాత్రం మహిళల్ని ముఠాలుగా మార్చుకుని.. వారిని దాడులకు పులికొల్పడం… విజయవాడలో నవ్వుల పాలవుతోంది. అవినాష్ చేయగలిగేది ఇదేనా అని జనం గేలిచేస్తున్నారు. అయితే అవినాష్ మాత్రం.. టీడీపీ వాళ్లే దాడులకు పాల్పడుతున్నారని చెప్పుకొస్తున్నారు. అవినాష్ ఏర్పాటు చేసుకున్న లేడీ ముఠాల వ్యవహారం ఇప్పుడు వైసీపీలోనూ లాఫింగ్ స్టాక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close