ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు డిప్యూటేషన్ పెంచారు. అది నిబంధనలకు విరుద్ధం. అయినా సరే మరోసారి కేంద్రం నుంచి డిప్యూటేషన్ ఉత్తర్వులు పొడిగింపు చేయించుకున్నారు.

జగన్ రెడ్డి సీఎం అవగానే టీటీడీలో వాలిపోయిన ఆయన ఐఏఎస్ కాదు..ఐపీఎస్ కాదు.. కనీసం కన్ ఫర్డ్ ఐఏఎస్ కూడా కాదు. రక్షణ శాఖలో ఓ ఎస్టేట్ ఆఫీసర్. అదీ కూడా ఢిల్లీలో. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అనుబంధం పెంచుకుని తన లాబీయింగ్ తెలివితేటలతో జగన్ రెడ్డికి ఆత్మీయుడయ్యారు. టీటీడీని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి ధర్మారెడ్డి. జగన్ కోసం దేవుడి పేరుతో లాబీయిగ్ చేయడంలో ఆయన అన్ని రకాల హద్దులనూ దాటేశారు. న్యాయమూర్తుల ఇళ్లలో శుభకార్యాలకు వెళ్లి ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా ఆయనకు పొడిగింపు లభించింది.

ధర్మారెడ్డి చేస్తున్న నిర్వాకాలపై ఎన్డీఏ కూటమిలోని నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనను టీటీడీ పోస్టు నుంచి తప్పించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన లేదు. చర్యలు తీసుకోకపోయినా రిటైరయ్యే ముందు మాతృ సంస్థలో రిపోర్టు చేయాల్సి ఉన్నా కాదని.. డిప్యూటేషన్ పొడిగింపు తెచ్చుకున్నారు. బీజేపీ దగ్గర.. కేంద్రం దగ్గర… వైసీపీ ధర్మారెడ్డికి ఉన్న పలుకుబడి అలాంటిది మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close