నిజామాబాద్ ఎంపీకి పసుపు గండం..!

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు అప్పుడే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు ఆ సమయంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపుబోర్డు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. కానీ బీజేపీ సర్కార్ ఇవ్వలేదు. అదే హామీని అరవింద్ ఇచ్చారు. ఆయన ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. బాండ్ పేపర్లు రాసిచ్చారు. దాంతో రైతులు ఆయనకు ఏకపక్షంగా మద్దతు పలికారు. ఆ విషంయ పోలింగ్ సరళిలో తేలింది. ఆ సమయంలో ఎన్నికల బరిలో కూడా… కొన్ని వందల మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి పోటీకి నిలిచారు. రైతు దెబ్బకు కవిత ఓడిపోయారు.

అరవింద్ గెలిచారు. గెలిచినప్పటి నుండి పసుపు బోర్డు కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ పసుపు బోర్డు కాకుండా.. స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని అరవింద్ తీసుకు వచ్చారు. అయితే ఇది రైతుల్ని సంతృప్తి పరచలేదు. పసుపుబోర్డుపై ఆయన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. తాజాగా రైతులు మళ్లీ నిరసనలకు దిగారు. దీంతో రైతులతో సమావేశమై.. వారిని కన్విన్స్ చేసేందుకు అర్వింద్ ప్రయత్నిస్తున్నారు. ఇలా జరిగిన ఓ సమావేశంలో రైతులు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, రూ.15 వేలు మద్దతు ధర ఇప్పిస్తానని..నేను ఎక్కడా చెప్పలేదని ధర్మపురి అర్వింద్ ఎదురుదాడికి దిగారు.

పసుపు బోర్డు తెస్తానని మాత్రమే చెప్పానన్నారు. పసుపు ధరకు మద్దతు ధర కోసం మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. నిర్ణయం తీసుకోవాల్సింది మీరేనని కూడా తేల్చేశారు. దీంతో రైతులు అసంతృప్తికి గురయ్యారు. డౌన్ డౌన్ నినాదాలు చేశారు. బీజేపీలో యువ నేతల్లో ధాటిగా ఎదుగుతున్న అరవింద్‌కు పసుపుబోర్డు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎలాగోలా పసుపుబోర్డు ఏర్పాటు చేయించకపోతే.. రాజకీయంగా కూడా ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close