స‌ర్కారు కథ‌ బ‌న్నీకి చెప్ప‌లేద‌ట‌!

గీతా ఆర్ట్స్‌లో వ‌రుస‌గా రెండు సినిమాలు చేశాడు ప‌ర‌శురామ్‌. ఒక‌టి.., శిరీష్‌తో అయితే మ‌రోటి… విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో. నిజానికి అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల‌ని ఆ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు ప‌ర‌శురామ్‌. కొన్ని క‌థ‌లూ వినిపించాడు. `గీత గోవిందం` క‌థ బ‌న్నీతోనే చేయాల‌నుకున్నాడు ప‌ర‌శురామ్. అది సెట్ అవ్వ‌లేదు. ఇప్పుడు మ‌హేష్‌తో `స‌ర్కారు వారి పాట` తీశాడు. అయితే ఈ క‌థ కూడా బ‌న్నీకి వినిపించాడ‌ని, బ‌న్నీ `నో` అన్న త‌ర‌వాతే మ‌హేష్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపించాయి. దీనిపై ప‌ర‌శురామ్ క్లారిటీ ఇచ్చేశాడు.

“ఇది మ‌హేష్ ని దృష్టిలో ఉంచుకుని రాసుకున్న క‌థ‌. ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు. ఈ క‌థ విన్న ఒకే ఒక్క హీరో.. మ‌హేష్ మాత్ర‌మే. విన‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది. మ‌హేష్‌కి త‌ప్ప మ‌రెవ్వ‌రికీ ఈ క‌థ సూట్ కాదు. ఇది మ‌హేష్ కోస‌మే పుట్టింది. ఆయ‌న‌మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. ఫ‌స్ట్ సిట్టింగ్ లోనే మ‌హేష్ ఓకే చేసిన క‌థ ఇది. ఇది వ‌ర‌కు ఆయ‌న‌కూ,నాకూ అస్స‌లు ప‌రిచ‌య‌మే లేదు. మ‌హేష్ అప్పాయింట్ మెంట్ తీసుకొనేస‌రికి.. నా గురించి ఆయ‌న‌కు ఏం తెలీదు కూడా. కేవ‌లం క‌థ న‌చ్చి.. ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు“ అని క్లారిటీ ఇచ్చాడు ప‌ర‌శురామ్‌. త‌న త‌దుప‌రి సినిమా నాగ‌చైత‌న్య‌తోనే అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. `గీత గోవిందం` పూర్త‌యిన వెంట‌నే చైతూతో ఓ సినిమా చేయాలి. అప్ప‌టి స‌మీక‌ర‌ణాల్లో ఆ సినిమా చేయ‌డం కుద‌ర్లేదు. అప్ప‌టి ఆ క‌థ‌తోనే ఇప్పుడు చైతూతో సినిమా ప‌ట్టాలెక్కిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close