జగన్ రెడ్డి ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ ఇద్దరు కార్యకర్తల్ని బలి తీసుకున్నారు. అందులో ఒకరు స్వయంగా ఆయన కారు ఢీకొనడంతో చనిపోయినట్లుగా తాజాగా ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు శివారులో ఏటుకూరు రోడ్ వద్ద జగన్ కాన్వాయ్ వచ్చిన సమయంలో కారు ఢీకొనడంతో సింగయ్య అనే దళిత వృద్ధుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. అతన్ని రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు.
ఆయనను ఢీ కొన్న కారు.. జగన్ కాన్వాయ్ లోనిది కాదని గుంటూరు ఎస్పీ సతీష్ చెప్పారు. కానీ ఎస్పీకి అలాంటి సమాచారం ఎవరు ఇచ్చారో కానీ .. ఏ కారు ఢీకొట్టిందో దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. ఆ కారు జగన్ కాన్వాయ్ లోనిది కాదు.. స్వయంగా జగన్ కారే ఢీకొట్టినట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గుంటూరు పోలీసులు వీడియోలు బయటకు తీసి.. జగన్ తో పాటు కారు పక్కన ఉన్న వారిని పిలిచి ప్రశ్నిస్తున్నారు.
సింగయ్య చికిత్స పొందుతూ చనిపోయాడు. దాంతో అది హత్య కేసు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. సింగయ్య పరుగెత్తుకుంటూ కారు వైపు వస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. జగన్ రెడ్డి దండాలు పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన కారు కింద పడటం చూశారు కానీ పట్టించుకోలేదు. జగన్ పట్టించుకోకపోవడంతో ఇతర కార్యకర్తలూ పట్టించుకోలేదు. ఫలితంగా సింగయ్య ప్రాణాలు పోయాయి. ఇప్పుడు మరిన్ని కీలకమైన వీడియోల కోసం చూస్తున్నారు. ఆధారాలు లభిస్తే.. కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.