ఏపీకి సహకరించొద్దని జగన్ లేఖ రాశారా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సహకరించొద్దంటూ జగన్ సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశారని ఆరోపించారు. ఆ ప్రభుత్వం ఈ లేఖలు చూసి నవ్వుకుని వాటిని చెత్తబుట్టలో వేసిందని లోకేష్ చెప్పారు. నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఈ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దానిని అడ్డుకోవటమే జగన్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేతప్ప ఆ ప్రాంతాలు ఆభివృద్ధిలోకి వస్తాయని జగన్ ఆలోచించటంలేదని అన్నారు. కనీసం రాజధాని కూడా లేని దుస్థితిలో ఏపీ ఏర్పడిందని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రం నిలదొక్కుకోవటానికి, రాజధాని కట్టుకోవటానికి అందరూ తలో చెయ్యి వేయాలని, జగన్ మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

జగన్‌పై ఇంత సంచలన ఆరోపణలు చేసిన లోకేష్ దానికి ఆధారాలు బయటపెట్టకపోవటంతో ఆయన ఆరోపణల విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలుకూడా ఇవాళ లోకేష్ ఆరోపణలను ఖండించలేదు. ఈ విషయంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close