ప‌ర‌శురామ్‌కు దిల్ రాజు అభ‌య‌హ‌స్తం

‘గీత గోవిందం’ తో వ‌చ్చిన క్రేజ్‌ని కాపాడ‌లేక‌పోతున్నాడు ప‌ర‌శురామ్‌. ‘స‌ర్కారు వారి పాట‌’ ద్వారా మ‌హేష్ బాబు తో ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింది. కాక‌పోతే ఆ సినిమా ఎబౌ ఏవ‌రేజ్ మార్క్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. క‌థ‌కుడిగా ఆ సినిమాలో మైన‌స్ మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’ విష‌యంలోనూ తేలిపోయాడు. ఈ సినిమాకు క‌నీసం వ‌సూళ్లు కూడా రాలేదు. దాంతో ప‌ర‌శురామ్ ప‌రిస్థితి ఏమిటా? అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర `రెంచ్ రాజు` అనే ఓ క‌థ ఉంది. దాన్ని కార్తీతో చేయాల‌ని ఆలోచ‌న‌. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్ట‌యితే, త‌ప్ప‌కుండా కార్తితో కాంబినేష‌న్ సెట్ట‌య్యేదే. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దాంతో కార్తి సినిమా డైలామాలో ప‌డింది.

అయితే దిల్ రాజు మాత్రం ప‌ర‌శురామ్ కు అభ‌య‌హ‌స్తం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ‘ఫ్యామిలీ స్టార్‌’ రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా ప‌ర‌శురామ్ తో మ‌రో సినిమా చేస్తాన‌ని ముందే మాటిచ్చాడ‌ట దిల్ రాజు. `రెంచ్ రాజు` క‌థ కార్తి ఓకే అన్నా, లేకున్నా – ఈ క‌థ‌కు సెట్ట‌య్యే మ‌రో హీరోని తెచ్చుకొంటే, దిల్ రాజు బ్యాన‌ర్‌లో ప‌ర‌శురామ్ సినిమా ఉంటుంది. దిల్ రాజు బ్యాన‌ర్ అంటే… ఏ హీరో అయినా, ఆలోచించ‌కుండా దూకేస్తాడు. దాంతో…. ‘రెంచ్ రాజు’పై ప‌ర‌శురామ్ న‌మ్మ‌కంతో ఉన్నాడు. `ఫ్యామిలీ స్టార్` కోసం ప‌ర‌శురామ్ రూ.14 కోట్ల పారితోషిం అందుకొన్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈసారి మాత్రం అందులో స‌గం ఇచ్చినా సంతోష‌మే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close