‘ఫ్యామిలీ స్టార్‌’ని ప‌రుగులు పెట్టిస్తున్న దిల్ రాజు

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో దింపారు. అయితే… ఈ సినిమా షూటింగ్ ఆల‌స్యం అవుతోంద‌ని, సంక్రాంతికి రావ‌డం లేద‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అమెరికాలో జ‌ర‌గాల్సిన ఓ షెడ్యూల్ అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డింది. దాంతో.. సంక్రాంతికి రావ‌డం క‌ష్ట‌మే అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ద‌ర్శ‌క నిర్మాత‌లు మాత్రం త‌మ వంతు ప్ర‌య‌త్నాలు ఆప‌లేదు. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ముగించుకొని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి ప్రిపేర్ అవ్వాల‌ని చూస్తోంది.

ఆదివారం ఇండియా – ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ క‌ప్ ఫీవ‌ర్‌ టాలీవుడ్ గ‌ట్టిగా క‌నిపించింది. ‘పుష్ప‌’, ‘గుంటూరు కారం’ లాంటి భారీ సినిమాలు సైతం ఆదివారం షూటింగ్ క్యాన్సిల్ చేసేశాయి. అయితే `ఫ్యామిలీ స్టార్‌` షూటింగ్ మాత్రం ఆదివారం కూడా నిరాటంకంగా సాగింది. ఇప్ప‌టి నుంచి ఎలాంటి బ్రేకూ లేకుండా షూటింగ్ చేస్తే సంక్రాంతికి రావ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఒక‌వేళ పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల వ‌ల్ల ఆల‌స్యం అయితే, అప్పుడు రిలీజ్ డేట్ విష‌యంలో పున‌రాలోచించాల‌ని, ప్ర‌స్తుతానికైతే సంక్రాంతి టార్గెట్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకొనే ప‌ని చేయాల‌న్న‌ది టీమ్ ఆలోచ‌న‌. దిల్ రాజుకి సంక్రాంతి సెంటిమెంట్ బ‌లంగా ఉంది. ప్ర‌తీ సీజ‌న్‌లోనూ ఆయ‌న బ్యాన‌ర్ నుంచి ఓ సినిమా విడుద‌లై, హిట్టు కొట్ట‌డం ఆనవాయితీగా మారింది. ఆ సెంటిమెంట్ త‌ప్ప‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే దిల్ రాజు.. ఫ్యామిలీ స్టార్‌ని ప‌రుగులు పెట్టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close