దిల్ రాజు సినిమాని ఒకే చేసిన పవన్ కళ్యాణ్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయబోతున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా ఈరోజు హైదరాబాద్ లో ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ఇంకా దర్శకుడు, కధని ఎంచుకోవలసి ఉందని తెలిపారు. సాధారణంగా దర్శకుడు హీరో, నిర్మాతలకి కధ చెప్పిన తరువాత అది వారికి నచ్చినట్లయితే ముందుకు వెళతారు. చిరంజీవి తన 150వ సినిమా కోసం చాలా కధలు విన్నారు. చివరికి దర్శకుడు పూరీ జగన్నాద్ చెప్పిన కధలో మొదటి భాగం వరకు ఒప్పుకొన్నా రెండవ భాగం నచ్చకపోవడంతో వారి సినిమా అటకెక్కినట్లే ఉంది. పూరీ కూడా వేరే సినిమాకి వెళ్ళిపోయారు. త్వరలో పూరీ వచ్చి తనకు రెండవ భాగం చెపితే ఆయనతో సినిమా చేస్తానని లేకుంటే తను వేరే సినిమాకి కమిట్ అయిపోతానని చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ అయన సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం కధ వినకుండానే, దర్శకుడి ఎవరో తెలియకుండానే నిర్మాత దిల్ రాజుపై నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరించారు.

పవన్ కళ్యాణ్ తో తను చేయబోయే సినిమాకి కధ, దర్శకుడు ఎంపిక పూర్తయితే తమ సినిమా వివరాలను తెలియజేస్తానని దిల్ రాజు మీడియాకి తెలిపారు. తనకు చిరంజీవి 150వ సినిమాకు నిర్మాతగా ఉండాలని ఉన్నప్పటికీ రామ్ చరణ్ తేజ్ స్వయంగా నిర్మిస్తున్నందున ఆ అవకాశం దక్కలేదని కానీ ఆ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను తనే తీసుకొంతానని తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సీక్వెల్ గా తీస్తున్న సర్దార్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోగా దిల్ రాజు తమ సినిమాకు దర్శకుడిని, కధని సిద్దం చేసుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close