తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అనర్హతా వేటు తప్పదా !?

గత వారం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అయితే ఇది రొటీన్ బదిలీ అని అనుకున్నారు.. కానీ చాలా పెద్ద కథ ఉందని మెల్లగా బయటకు వస్తోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతకం తిరగబడే వ్యవహారం ఉందని .. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌తో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు. దాన్ని అధికారులు అంగీకరించారు. దాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

తొలి దశలోనే ఎన్నికలు జరగడంతో.. దాదాపుగా రెండు నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు వెబ్‌సైట్‌లో శ్రీనివాస్‌గౌడ్‌కు చెందిన కొత్త అఫిడవిట్ ప్రత్యక్ష మయింది. పాతది తొలగించారు. ఓ సారి నామినేషన్‌తో పాటు ఆమోదించిన అఫిడవిట్‌ను తొలగించడం అసాధ్యం. ఎన్నికల అధికారులు సహకరించడంతో అలా చేయగలిగారు. ఆ ఆఫిడవిట్‌తో తప్పులు తడకలు ఉండటంతో ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గమించిన కొంత మంది ఈసీకి ఫిర్యాదు చేశారు. గత ఏడాదిలో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి వివరాలు పంపాలని శశాంక్ గోయల్‌కు కేంద్ర ఈసీ నుంచి సమాచారం వచ్చింది.

విచారణ జరిపిన గోయల్ అలా జరిగింది నిజమేనని తేల్చినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి ఎన్నికల అధికారిగా ఉన్న రజత్ కుమార్‌కు కూడా ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ఫ్రాడ్‌లను చాలా సీరియస్‌గా పరిగణిస్తారు. దీంతో అటు శ్రీనివాస్ గౌడ్.. ఇటు రజత్ కుమార్ కూడా నిండా మునిగిపోయినట్లేనని భావిస్తున్నారు. రజత్ కమార్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close