పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి అన్యాయం చేశారని అంటోంది దివ్వెల మాధురి. వైసీపీ విధానాలను ప్రశ్నించిన ఆమె, పార్టీలో లీడర్ , లీడర్ కు ఓ క్రమశిక్షణ విధానం ఉంటుందా అన్నారు. రోజాకు ఒక న్యాయం – దువ్వాడకు మరో న్యాయమా అంటూ జగన్ నిర్ణయాన్ని పరోక్షంగా ప్రశ్నించారు.
ఇటీవల ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు దివ్వెల మాధురి – దువ్వాడ శ్రీనివాస్. మీ ఇద్దరు కలిసి డ్యాన్సులు చేయడం వలెనే వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారంట కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు దువ్వాడ మాత్రం మౌనం వహించగా.. మాధురి మాత్రం జగన్ రెడ్డిని ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నించారు.
తాము డ్యాన్స్ చేయడమే తప్పు అయితే , అదే పార్టీలో ఉన్న రోజా స్టెప్స్ వేస్తే ఆహో, ఓహో అంటారా? ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు మాధురి. టీవీ షోలకు హాజరై ఆమె డ్యాన్స్ చేయలేదా అని ఫైర్ అయ్యారు. రీల్స్ చేయడమే దువ్వాడ సస్పెన్షన్ కు కారణమైతే.. వైసీపీలో చాలామందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందన్నారు.
దివ్వెల మాధురి ఈ వ్యాఖ్యలు చేస్తుంటే దువ్వాడ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంటే ఓ రకంగా ఆయన కూడా మాధురి అభిప్రాయంతో ఉన్నారని అర్థం అవుతోంది.