జలాల వివాదాలు కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా..!?

తెలుగు రాష్ట్రాల మధ్య రగడకు కారణమైన జల వివాదాలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. విభజన చట్టం ప్రకారం తాము నోటిఫై చేసిన కృష్ణా, గోదావరి నదీ బోర్డులు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రెండు నదీ బోర్డులు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. 9వ తేదీన హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరుగుతుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా.. ప్రభుత్వం పేర్కొన్న గెజిట్‌లోని అంశాలపై చర్చిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం నదీ బోర్డులను నోటిఫై చేయడం.. అందులో అన్ని ప్రాజెక్టులను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ మాత్రం.. నోటిఫై చేయడాన్ని అంగీకరించినా… వాటిలో అన్ని ప్రాజెక్టులను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో రెండు రోజుల కిందట కృష్ణాబోర్డు సమావేశానికి హాజరైనప్పటికీ… గెజిట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పైగా వాటిని తాము కేంద్రానికే చెబుతామని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల నడుమ… రెండు నదుల బోర్డులు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను గడువులోగా అమలయ్యేలా తేదీల వారీగా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర జల మంత్రిశ్వ శాఖ రెండు బోర్డుల ఛైర్మన్లను ఆదేశించింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు 11 మందితో.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇప్పుడు నదీ యాజమాన్య బోర్డులే కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. గతంలో బోర్డుల్ని నోటిఫై చేయకపోవడం వల్ల.. పరస్పర అంగీకారంతో కృష్ణాబోర్డు గత ఒప్పందాలను బట్టి నీటి పంపకాలు చేసేవారు. అయితే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఆ ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల బోర్డులను కేంద్రం నోటిఫై చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులు మొత్తం బోర్డుల పరిధిలో ఉన్నాయి. గత ఒప్పందాల ప్రకారమే బోర్డులు నీటిని పంచుతాయి. అయితే ప్రతీ చిన్న విషయానికి ప్రాజెక్టుల విషయంలో బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ కారణఁగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ అంత అనుకూలంగా లేవు. తొమ్మిదో తేదీన సమావేశానికి రావాలని తెలంగాణకు కూడా సమాచారం పంపారు. అయితే హాజరయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు. దీంతో.. నదీ జలాల పరిష్కారానికి కేసీఆర్ సిద్ధంగా లేరన్న అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close