పవన్‌ వద్దకు మనోజ్‌ను మోహన్ బాబు పంపారా !?

భీమ్లా నాయక్ షూటింగ్ సెట్‌లో ఉన్న పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ చర్చలు జరిపారు. మాములుగా అయితే ఎవరూ పట్టించుకోరు కానీ ప్రస్తుతం “మా” రగడ కొనసాగుతున్నందున అదే అంశంపై చర్చించేందుకు మోహన్ బాబు పంపించి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మోహన్ బాబు మా ఎన్నికల్లో పైచేయి సాధించారు. ఎలా సాధించారన్నదానిపై విమర్శలు ఉన్నా.. గెలుపు గెలుపే. ఇప్పుడు అందర్నీ కలుపుకుని వెళ్తే తప్ప ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు.

ఏకపక్షంగా వెళ్తే ఇండస్ట్రీ చీలిపోతుంది. ఇలాంటి సమయంలో బాధ్యత తీసుకున్న మోహన్ బాబు మెగా క్యాంప్‌తో మళ్లీ మంచి సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని కలుస్తానని మంచు విష్ణు ప్రకటించిన తర్వాత మంచు మనోజ్ వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. ఎన్నికలకు ముందు మోహన్ బాబుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వివాదం ఉంది. పాయింట్ టు పాయింట్ స్పందిస్తానని మోహన్ బాబు ప్రకటించారు.

కానీ ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. మాట్లాడాలని కూడా అనుకోవట్లేదని చెబుతున్నారు. టాలీవుడ్‌లోని పెద్దలందరూ ప్రస్తుతం వివాదానికి ముగింపు పలికి అందరూ కలిసి పని చేసుకోవాలనే పద్దతిలో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మోహన్ బాబు కూడా సానుకూలంగానే ఉన్నారని తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మంచు మనోజ్ కలిశారని అంటున్నారు. అదే నిజమైతే.. మా రాజకీయాలకు టాలీవుడ్‌లో పుల్‌స్టాప్ పడే అవకాశం ఉందనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

నేటితో ప్రచారానికి తెర…నేతల ప్రచార షెడ్యూల్ ఇలా

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close